Switch to English

తూర్పుగోదారి జిల్లాలో ‘అగ్గి’.! అప్పుడూ, ఇప్పుడూ అదే రాజకీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా చాలా ప్రత్యేకమైనది. ప్రకృతి అందాలకు నెలవు. గౌరవ మర్యాదలకు కేరాఫ్ అడ్రస్. ప్రశాంతమైన జిల్లా.. రాజకీయ చైతన్యం ఎక్కువ. వ్యాపార కార్యకలాపాలకూ కేరాఫ్ అడ్రస్. అలాంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ఎప్పుడూ ‘రాజకీయ కత్తి’ వేలాడుతూనే వుంటుంది.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, తుని రైలు దహనం ఘటన చోటు చేసుకుంది. అప్పట్లో కాపు ఉద్యమం సెగ రైలుకి అంటుకుందనే ప్రచారం జరిగింది. కానీ, నిజానికి అసలు సెగ అది కాదు. రాజకీయ సెగ రైలుని తగలబెట్టింది.

‘టీడీపీనే ఆ రైలుని తగలబెట్టింది..’ అని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘కాదు కాదు, వైసీపీనే ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది..’ అంటూ అప్పటి అధికార పక్షం టీడీపీ ఎదురుదాడికి దిగింది. ఇంతకీ, రైలు తగలబడటానికి తెరవెనుకాల రాజకీయ మంత్రాంగం నడిపిందెవరన్నది మాత్రం ఇప్పటికీ తేలలేదు.

ఆనాటి ఆ కాపు ఉద్యమం అనూహ్యంగా ఆ తర్వాత చల్లారిపోయింది. కాపు యువత లాఠీ దెబ్బల్ని తిన్నారుగానీ, ఆ ఉద్యమం విజయ తీరాలకు చేరలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తూర్పుగోదావరి జిల్లా నుంచి వేరుపడ్డ కోనసీమ జిల్లాలో అగ్గి రాజుకుంది.

మంత్రి విశ్వరూప్, అదికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సతీష్ ఇళ్ళు నిరసనకారుల మంటల్లో తగలబడిపోయాయి. కోనసీమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆ జిల్లా పేరుని కొనసీమగా వుంచకుండా, అంబేద్కర్ పేరు పెట్టడమేంటన్నది నిరసనకారుల ఆందోళనకు కారణం.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదు. రాజధాని లేదనే కోణంలోనూ ఇంత తీవ్రస్థాయిలో ఆందోళనలు జరగలేదు. కేవలం జిల్లా పేరు విషయంలో ఇంత రచ్చ జరగడమా.? అసలు కారణం అది కాదు. తెరవెనుకాల ఏదో పెద్ద కథ వుంది. తూర్పుగోదావరి జిల్లాలోనే రెండు ఘటనలు.. తీవ్రమైన ఘటనలు ఒకటి చంద్రబాబు హయాంలో ఒకటి వైఎస్ జగన్ హయాంలో జరిగాయంటే.. కాస్త లోతైన చర్చే జరగాలి ఈ ఘటనలపై.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...