ప్రాణాలు పోతున్నా, ‘ఏం ఫర్లేదు.. ఆల్ ఈజ్ వెల్..’ అంటోంది ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత అనూహ్యంగా పెరిగింది. రోజువారీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కుని టచ్ చేసింది. అదీ 40 వేల టెస్టులకి మాత్రమే. పొరుగు రాష్ట్రం తెలంగాణలో లక్షా పది హేను వేల టెస్టులు రోజువారీగా జరిగాయి నిన్న. అక్కడ మూడున్నర వేల కోవిడ్ పాజిటివ్ కేసులు నిన్న నమోదయ్యాయి.
సరే, ఒక్కో రాష్ట్రానిదీ ఒక్కో లెక్క వుంటుందనుకోండి.. అది వేరే సంగతి. అయితే, ఏపీలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఆసుపత్రి చేరికలూ పెరుగుతున్నాయి. ఇదంతా సంక్రాంతి ఎఫెక్ట్ అనీ, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దయెత్తున జనం సొంతూళ్ళకు రావడంతోనే ఈ పరిస్థితి అనీ, ‘కవరింగ్’ డైలాగులు చెబితే సరిపోదు. కోడి పందాల నిర్వహణ విషయంలోనూ, కాసినోల నిర్వహణ విషయంలోనూ జగన్ సర్కార్ చూసీ చూడనట్టు వ్యవహరించడంతోనే ఈ దుస్థితి అన్నది నిర్వివాదాంశం.
సరే, అయ్యిందేదో అయిపోయింది. కోవిడ్ తీవ్రత ఈ స్థాయిలో వున్నా ప్రభుత్వం, కోవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటన్నదే కీలకం. విద్యా సంస్థలు యధాతథంగా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇదే అసలు సమస్య. సంక్రాంతి సెలవుల్ని ఓ వారం పది రోజులైనా పొడిగించి వుంటే, కోవిడ్ ఈ స్థాయిలో విజృంభించి వుండేది కాదేమోనన్నది మెజార్టీ అభిప్రాయం.
‘మేం, విద్యార్థుల ఉద్ధరణకు కట్టుబడి వున్నాం..’ అంటోంది జగన్ సర్కారు. ఇదెక్కడి వింత వాదన. సంక్రాంతికి ఓ వారం రోజుల సెలవులిచ్చారు కదా, ఇంకో వారం సెలవుల్ని పొడిగిస్తే అదనంగా వచ్చే నష్టమేముంటుంది.? అయినా, విద్యార్థుల ప్రాణాల కన్నా చదువులు ముఖ్యమని ఎవరు చెప్పారు.?
తీవ్ర నష్టం జరిగిపోయాక, ఇప్పుడు నైట్ కర్ఫ్యూ అంటున్నారు. అదేదో పండగ సమయంలో పెట్టి వుంటే, రాష్ట్రమిలా కోవిడ్కి కేరాఫ్ అడ్రస్ అయి వుండేది కాదు. 40 వేల టెస్టులకి 10 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు వచ్చాయంటే, లక్ష ఆ పైన టెస్టులు చేస్తే.. కోవిడ్ సునామీ కనిపిస్తుందేమో.!
147637 543522I enjoy your writing style actually enjoying this web website . 267054