కరోనా మహమ్మారి ప్రపంచం మీద చేస్తున్న దండయాత్ర మరింత తీవ్ర స్థాయికి చేరింది. అందుకే ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన సినిమా షూటింగ్ లు మాత్రం అనుకున్న స్థాయిలో ప్రారంభం కాలేదు. ముఖ్యంగా షూటింగ్ కి 40 నుంచి 50 మందిని మాత్రమే అనుమతించడంతో పెద్ద బడ్జెట్ సినిమాల వారు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్(వర్కింగ్ టైటిల్)’ కూడా ఒకటి.
ఇప్పటికే ఈ చిత్ర టీం 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. కథానుగుణంగా ఈ సినిమా ఎక్కువ భాగం అబ్రాడ్ లో జరగాలి కానీ ఇప్పుడు అక్కడికివెళ్ళి షూట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ చిత్ర టీం రానున్న నెలల్లో ఇండియా బ్యాక్ డ్రాప్ సీన్స్ మరియు అబ్రాడ్ లో ఇండోర్ లో చేయాల్సిన సీన్స్ ని సెట్స్ వేసి తీయాలి అనుకుంటున్నారు.
అందులో భాగంగా ప్రణాళికని కూడా సిద్ధం చేశారు. మొదటగా నాలుగు ఫ్లోర్లు ఉండే ఓ హాస్పిటల్ సెట్ ని ముందుగా నిర్మించనున్నారు. ఈ హాస్పిటల్ సెట్ కోసం అక్షరాల 5 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఓ ప్రైవేట్ స్టూడియోలో ఫ్లోర్ ని కూడా తీసుకున్నారు. ఈ హాస్పిటల్ సెట్ లో ఓ ఐసియు రూమ్, ఓ స్పెషల్ వార్డు, జనరల్ వర్డ్స్ తో సహా పలు హాస్పిటల్ సెటప్ రూమ్స్ ని కూడా నిర్మించనున్నారు. ఈ నెలాఖరున సెట్ వర్క్ మొదలు పెట్టి, జులైలో ఫినిష్ చేసి షూటింగ్ ప్రారంభించాలనేది వారి ఆలోచన. ఒకవేళ రానున్న మూడు నెలల్లో అబ్రాడ్ కి క్లియరెన్స్ వస్తే జార్జియాలో ఓ పాత, పలు సీన్స్ ని ప్లాన్ చేస్తారు, లేదంటే ఆ సీన్స్ కోసం ఇక్కడే సెట్స్ వేసే ఆలోచనలో ఉన్నారు.
దీని ప్రకారం ఈ సినిమా 2021 సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఈ చిత్ర టీం చెబుతోంది. ప్రభాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ డైరెక్టర్. యువి క్రియేషన్స్ – గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
867434 405906Someone necessarily assist to make critically articles Id state. This really is the very first time I frequented your internet page and thus far? I amazed with the analysis you created to make this actual submit incredible. Excellent activity! 344900