చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. కలకడ మండలం బాటవారిపల్లె గ్రామానికి చెందిన మహేష్బాబు అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతడి అంత్య క్రియలకు హాజరు అయ్యేందుకు తిరుపతిలో ఉంటున్న తాతయ్య వెంకట్రమణ, అమ్మమ్మ పార్వతమ్మ, బంధువులు సుజనమ్మ, చిన్నమ్మ రెడ్డి గోవర్దిని, దామోదర, లీలావతి, పుష్ప కుమారిలు ఆటోలో పీలేరుకు చేరుకున్నారు. ఆ తర్వాత వారు రాత్రి సమయంలో వెనక్కు మళ్లారు.
ఆటోలో రాత్రి సమయంలో వెను దిరిగి వస్తున్న సమయంలో కొత్తగాండ్ల పల్లె మార్గ మద్యలో కంభంవారిపల్లె మండలం సోరకాయల పేట చెరువు కట్ట వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దాంతో వెంకట్రమణ, పార్వతమ్మ, సుజనమ్మ, రెడ్డి గోవర్ధిని అక్కడికి అక్కడే మృతి చెందారు. దామోదర పీలేరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర శోకంను మిగిల్చింది. చావుకు వెళ్లి వస్తూ అయిదుగురు మృతి చెందడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
107036 325672magnificent post, really informative. I wonder why the other specialists of this sector do not notice this. You need to continue your writing. Im confident, youve a fantastic readers base already! 21278
95971 145103There is noticeably a great deal of money to comprehend this. I assume you produced certain nice points in functions also. 163978