తెలంగాణ గవర్నర్ తమిళిసై కోవిడ్ టెస్టు చేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్ నెగటివ్ వచ్చాయని ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా తీవ్రత ఎలా ఉందో తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతోంది. రీసెంట్ గా రాజ్ భవన్ లో పని చేస్తున్న సుమారు 10మంది సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం కరోనా పరిక్షలు చేయించుకున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్ భవన్ లో మొత్తం 395 కోవిడ్ పరిక్షలు నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కూడా పరిక్ష నిర్వహించారు. ఈ టెస్ట్ లో గవర్నర్ కు నెగటివ్ రిపోర్టు వచ్చింది. అయితే.. రాజ్ భవన్ లోని 28మంది పోలిస్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. వారందరినీ వెంటనే ఐసొలేషన్ కు పంపించారు. మరో 10మంది సిబ్బందికి పాజిటివ్ తోపాటు వారి కుటుంబసభ్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ 20 మందిని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో ఒక్క రాజ్ భవన్ నుంచే 48 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందింది.
రెడ్ జోన్లలో ఉన్నవారందరూ టెస్టులు చేయించుకోవాలని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు. త్వరగా టెస్టులు చేయించుకుంటే తమతో పాటు చుట్లూ అందరినీ రక్షించినవారవుతారని అభిప్రాయ పడ్డారు. కరోనా టెస్టులు చేయించుకునేలా ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈనెల 7వ తేదీన రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై గవర్నర్ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా రోగులకు అందుతున్న చికిత్స, ఏర్పాట్లపై చర్చించారు.
617722 658480To your organization online business owner, releasing an essential company may be the bread so butter inside of their opportunity, and choosing a fantastic child care company often indicates the certain between a victorious operation this really is. how to start a daycare 936897
645605 451130Its a shame you dont have a donate button! Id most certainly donate to this outstanding internet web site! I suppose within the meantime ill be happy with bookmarking and putting your Rss feed to my Google account. I appear forward to fresh updates and will share this blog with my Facebook group: ) 80225