తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతగా మారాయి. రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా వరంగల్ లోని అర్బన్ బీజేపీ ఆఫీస్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వీరిని అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు, టీఆరఎస్ కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగకుండా బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. పోలీసులు రెండు వర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో కూడా దాడులు చేశారు.
ఈ ఘటనకు కారణమైన వ్యాఖ్యలివే..
‘ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారా? సీఎం నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నాం. కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా సమయంలో తెలంగాణకు కేంద్రం 20లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయి. ఎంపీ ఓవైసీని జిన్నాతో పోలుస్తారా..? తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టారు. కేసీఆర్ పెద్దకొడుకు ఓవైసీ. కాంగ్రెస్ దేశానికి పట్టిన దరిద్రం’ అని అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
112617 317452I visited a great deal of internet site but I conceive this 1 holds something extra in it in it 69320
298081 56715hey there, your internet site is amazing. I do thank you for function 934643