కరోనా బాధితుల కోసం 2 కోట్ల విరాళం ప్రకటించిన విరుష్క దంపతులు.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఓ రెండేళ్ల చిన్నారి వైద్యానికి అవసరమైన 16 కోట్లు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారు. వివారాల్లోకి వెళ్తే.. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాలకు సంబంధించిన అరుదైన జెనెటిక్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ‘జోల్గెన్స్మా’ అనే మందు అవసరమైంది.
దీంతో చిన్నారి తల్లిదండ్రులు నిధుల కోసం ట్విటర్లో ‘AyaanshFightsSMA’పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి కోహ్లి దంపతులు తమ వంతు సాయం చేయడంతోపాటు అభిమానులను ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీంతో వైద్యానికి అవసరమైన 16 కోట్లు మే 23 నాటికి సమకూరాయి. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కోహ్లి దంపతులకు, దాతలకు ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తమ జీవితంలోనే కఠినమైన మ్యాచ్లో కోహ్లీ మమ్మల్ని సిక్స్తో గెలిపించారని కొనియాడారు.
54539 280699I gotta bookmark this site it seems extremely helpful extremely valuable 370468