ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకి చేరుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ‘అమరావతి పోరు’కి సంబంధించిన వార్తలు ఎక్కడా కన్పించకపోయినా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే వున్నారు.. అదీ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ.. లాక్ డౌన్ నిబంధనల్ని పాటిస్తూ. చాలా ప్రత్యేకమైన పోరాటమిది. రాజధాని అమరావతి కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది గనుక, ఆ అమరావతి మీద అసహనం పుట్టుకొచ్చిందో ఏమోగానీ.. ముఖ్యమంత్రి అవుతూనే, అమరావతిపై తనదైన స్టయిల్లో రాజకీయం షురూ చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
అధికారంలోకి వస్తూనే అమరావతి ప్రాంతంలో ప్రజా వేదికను కూల్చేయడంతో మొదలయ్యింది అసలు ప్రసహనం. ప్రజా వేదిక మీద ‘అక్రమ కట్టడం’ అనే ముద్ర వేసి కూల్చేశారుగానీ, ఆ పక్కన వున్న ఏ ప్రైవేటు భవనాన్నీ ఇప్పటిదాకా కూల్చేయలేకపోయింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక, అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకి తరలించే క్రమంలో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే ముసుగు వేయాలనుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా మార్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయ్యింది. కానీ, వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగిపోయింది. ప్రభుత్వ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ రైతులు ఎంత ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే, ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళడంతో, ఆ శాసన మండలిలో ఆగిపోయిన ‘మూడు రాజధానుల వ్యవహారం’ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోపక్క, తమకున్న విశేష అధికారాలతో కర్నూలుకి కొన్ని కార్యాలయాల్ని తరలించాలని జగన్ సర్కార్ భావించినా.. న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పలేదు. ఇక, అమరావతి కోసం రక్తం చిందించాల్సి వచ్చింది రైతులు. పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేసినా, అమరావతి రైతులు తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలో జరిగిన యాగీ.. హైకోర్టు ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలు తెలిసిన విషయాలే. అయితే, అమరావతి పోరాటంపై ‘కుల ముద్ర’ వేయడంలో కొంత మేర వైఎస్ జగన్ ప్రభుత్వం సఫలమయ్యిందనే చెప్పాలి.
అలాగని, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయగలిగిందా.? అంటే అదీ లేదు. 150 రోజులు కాదు.. ఇంకెన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి త్యాగలు వృధా కానివ్వబోమని రైతులు నినదిస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, అమరావతి కోసం జరుగుతున్న ఈ పోరు మాత్రం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సంక్షేమ పథకాల కోసం భూములు అమ్ముకుంటున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ, రైతులు తమ రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశారు. ఇదీ చరిత్ర అంటే.
935923 598358[…]the time to read or check out the content material or sites we have linked to below the[…] 650270
176881 197273Dead written subject matter, Genuinely enjoyed reading via . 957162