Switch to English

అమరావతి పోరుకి 150 రోజులు.. ఏం సాధించినట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,463FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి కొనసాగాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పోరాటం 150వ రోజుకి చేరుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ‘అమరావతి పోరు’కి సంబంధించిన వార్తలు ఎక్కడా కన్పించకపోయినా, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తూనే వున్నారు.. అదీ సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటిస్తూ.. లాక్‌ డౌన్‌ నిబంధనల్ని పాటిస్తూ. చాలా ప్రత్యేకమైన పోరాటమిది. రాజధాని అమరావతి కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి అనుగుణంగా అమరావతి ప్రాంత రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని అయ్యింది గనుక, ఆ అమరావతి మీద అసహనం పుట్టుకొచ్చిందో ఏమోగానీ.. ముఖ్యమంత్రి అవుతూనే, అమరావతిపై తనదైన స్టయిల్లో రాజకీయం షురూ చేశారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.

అధికారంలోకి వస్తూనే అమరావతి ప్రాంతంలో ప్రజా వేదికను కూల్చేయడంతో మొదలయ్యింది అసలు ప్రసహనం. ప్రజా వేదిక మీద ‘అక్రమ కట్టడం’ అనే ముద్ర వేసి కూల్చేశారుగానీ, ఆ పక్కన వున్న ఏ ప్రైవేటు భవనాన్నీ ఇప్పటిదాకా కూల్చేయలేకపోయింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. ఇక, అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నంకి తరలించే క్రమంలో కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించారు. విశాఖపట్నంకి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ అనే ముసుగు వేయాలనుకున్నారు. అమరావతిని శాసన రాజధానిగా మార్చారు. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్‌ అయ్యింది. కానీ, వ్యవహారం శాసన మండలి దగ్గర ఆగిపోయింది. ప్రభుత్వ ఆలోచనల్ని వ్యతిరేకిస్తూ రైతులు ఎంత ఆందోళన చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

అయితే, ప్రస్తుతం శాసన మండలి రద్దు వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళడంతో, ఆ శాసన మండలిలో ఆగిపోయిన ‘మూడు రాజధానుల వ్యవహారం’ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోపక్క, తమకున్న విశేష అధికారాలతో కర్నూలుకి కొన్ని కార్యాలయాల్ని తరలించాలని జగన్‌ సర్కార్‌ భావించినా.. న్యాయస్థానంలో మొట్టికాయలు తప్పలేదు. ఇక, అమరావతి కోసం రక్తం చిందించాల్సి వచ్చింది రైతులు. పోలీసులు విచక్షణా రహితంగా దాడులు చేసినా, అమరావతి రైతులు తట్టుకుని నిలబడ్డారు. ఈ క్రమంలో జరిగిన యాగీ.. హైకోర్టు ప్రభుత్వానికి వేసిన మొట్టికాయలు తెలిసిన విషయాలే. అయితే, అమరావతి పోరాటంపై ‘కుల ముద్ర’ వేయడంలో కొంత మేర వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సఫలమయ్యిందనే చెప్పాలి.

అలాగని, ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ముందడుగు వేయగలిగిందా.? అంటే అదీ లేదు. 150 రోజులు కాదు.. ఇంకెన్ని రోజులు పోరాటం చేయాల్సి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో ఇప్పటికే చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి త్యాగలు వృధా కానివ్వబోమని రైతులు నినదిస్తున్నారు. ఈ పోరాటం ఎక్కడిదాకా వెళుతుందోగానీ, అమరావతి కోసం జరుగుతున్న ఈ పోరు మాత్రం చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సంక్షేమ పథకాల కోసం భూములు అమ్ముకుంటున్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కానీ, రైతులు తమ రాష్ట్ర రాజధాని కోసం భూముల్ని త్యాగం చేశారు. ఇదీ చరిత్ర అంటే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...