మహారాష్ట్రలోని పుణె శివారు ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఏకంగా 15 మంది కార్మికులు మృతి చెందినట్లుగా అధికారులు వెళ్లడించారు. మరి కొంత మందికి గాయాలు అవ్వగా 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మంటల్లో చిక్కుకుని కాలిపోతున్న కార్మికుల ఆహాకారాలు స్థానికంగా భయాందోళనకు గురి చేశాయి. ఈ ప్రమాదంకు సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అధికారులు అన్నారు.
అగ్ని మాపక సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్స్ తో మంటలు అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయంత్రం చెలరేగిన మంటలు రాత్రి పొద్దు పోయే వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే తప్ప మృతదేహాలను బయటకు తీసే అవకాశం లేదు. మంటల్లో మృత దేహాలు బూడిద అయిపోతాయా అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారితే కాని పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు.
825846 948585After study quite a few the websites on your personal internet site now, i truly like your indicates of blogging. I bookmarked it to my bookmark site list and will also be checking back soon. Pls consider my web-site likewise and tell me what you consider. 649443
107662 905889Exploring in Yahoo I eventually stumbled upon this web site.Studying this information. 707624