అయిన వారు మృతి చెందితే ఆ బాధను మాటల్లో వర్ణించలేం. వారి కుటుంబసభ్యుల బాధను తీర్చలేం. కుటుంబంలోని మిగిలిన వారి జ్ఞాపకాలతో మదనపడిపోతారు. మానవ సంబంధాల్లో ఇది సహజం. అయితే.. రాజస్థాన్ లోని ఓ కుటుంబంలో అయిన వారు దూరమైన సందర్భంలో వారి గురించి బాధపడేవారు ఎవరూ లేకుండా పోయారు. ఎందుకంటే ఆ కుటుంబంలోని వారందరూ ఒకేసారి విషం తాగి ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు కారణం. హృదయవిదారకమైన ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
రాష్ట్రంలోని దేచు పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ కు చెందిన ఓ కుటంబం రాజస్థాన్ కు వలస వచ్చింది. ఆ కుటుంబంలో మొత్తం 12 మంది సభ్యులు ఉన్నారు. వారికి వచ్చిన కష్టమేంటో తెలియదు కానీ.. వారంతా ఒకేసారి విషం తాగారు. ఈ ఘటనకు సంబంధించి వారిలో 11 మంది మృతి చెందారు. మరొకరు స్థానిక ఆసుపత్రిలో కొన ఊపిరితో విషమ పరిస్థితుల్లో ఉన్నారు.
వారు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతం నుంచి పురుగుల మందు వాసన ఎక్కువగా రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగు చూసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపించారు. ఒకేసారి వీరంతా ఆత్మహత్య చేసుకోవడానికి కల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
398379 674590Ive read several very good stuff here. Definitely value bookmarking for revisiting. I surprise how considerably effort you put to create 1 of these exceptional informative website. 739473
11499 715003It is practically impossible to uncover knowledgeable males and girls during this subject, nonetheless you sound like do you know what you are discussing! Thanks 313328