ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో విడ్డూరం చోటు చేసుకుంది. మండలంలోని దుబ్బ తండాలో ఈనెల 17వ తారీకున గుగులోతు లచ్చిరాం ఇంట్లో 1.70 లక్షలు దొంగతనంకు గురి అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్వ్కాడ్ తో తనికీలు చేయడంతో క్లూస్ టీమ్ విచారణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో దొంగలను పట్టుకుంటాం అంటూ పోలీసులు నమ్మకంగా చెప్పిన నేపథ్యంలో ఆందోళన చెందిన దొంగలు ఆ మొత్తం డబ్బును ఏ ఇంటి నుండి అయితే దొంగిలించారో ఆ ఇంటి ముందు వేశారు.
21వ తారీకున లక్ష రూపాయలను ఇంటి ముందు కంప చెట్లలో వేసిన వారు తర్వాత రోజు 70 వేల రూపాయలను కూడా వేశారు. దాంతో దొంగిలించబడ్డ మొత్తం డబ్బు కూడా రికవరీ అయినట్లుగా అయ్యింది. ఇది ఖచ్చితంగా ఇంటి దొంగ పని లేదంటే పక్కింటి వారికి చెందిన పని అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
169387 223572Really informative post. Your current Internet site style is awesome as nicely! 583969