భారత పురాణాలు, ఇతిహాసాల్లో మాత్రమే కనిపించే యతి అనే వింత జీవి నిజంగానే ఉందా? భారత సైన్యం ట్వీట్ చేసిన ఫొటోల్లోని పాదముద్రలు యతివేనా? ఒకవేళ యతి అని జీవి ఉంటే, దానిని ఇప్పటివరకు మానవుడు ఎందుకు చూడలేకపోయాడు? ఇవీ తాజాగా చర్చనీయాంశమైన ప్రశ్నలు. నేపాల్ లోని మకాలు బేస్ క్యాంపు వద్ద తాము యతి పాదముద్రలు గుర్తించామంటూ భారత సైన్యం సోమవారం సాయంత్రం చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పులో ఉన్న ఆ పాదముద్ర యతిదే అంటూ భారత ఆర్మీ పేర్కొనడంతో మరోసారి యతి వార్తల్లో నిలిచింది.
ఇంతకీ నిజంగా యతి ఉందా అంటే దానికి ఇప్పటివరకు సరైన సమాధానం లేదు. ఎందుకంటే యతి గురించి విన్నవారే తప్ప ప్రత్యక్షంగా చూసినవారు ఒక్కరూ లేరు. హిమాలయ ప్రాంతాల్లో అప్పుడప్పుడూ కనిపించే భారీ పాదముద్రలే యతి ఉనికికి సాక్ష్యాలు అని అంటారు. యతి ఎలా ఉంటుందనే అంశపైనా భిన్నమైన వాదనలున్నాయి. మానవుడి కంటే భారీ పరిమాణంలో, ఒళ్లంతా వెంటుకలతో ఎలుగుబంటిని పోలి ఉండే జీవే యతి అనే ఎక్కువ మంది చెబుతారు. దీనిని మంచుమనిషి అని కూడా అంటారు.
హిమాలయాలతోపాటు సైబీరియా, ఆఫ్రికాల్లో మాత్రమే దీని జాడ దొరుకుందని, కొన్ని వందల ఏళ్ల నుంచి ఇది జీవిస్తోందనే కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాల ప్రకారం హనుమంతుడే యతి అనే వాదనలు కూడా ఉన్నాయి. చిరంజీవి అయిన హనుమంతుడు ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని, యతి పాదముద్రలు ఆయనవే అని పలువురు భక్తులు విశ్వసిస్తారు. జాంబవంతుడే యతి అని, ఆయనే హిమాలయాల్లో సంచరిస్తున్నాడని మరికొందరు చెబుతుంటారు. అది జంతువు కాదని, నేపాల్ కు చెందిన అతి పురాతన ఆటవిక తెగకు చెందిన మానవులే యతులన్న వాదన కూడా ప్రాచుర్యంలో ఉంది.
సాధారణ మానవుల కంటే వీరు పరిమాణంలో భారీగా ఉంటారని, వీరి ఒళ్లంతా వెంటుకలతో నిండిపోయి ఉంటుందని, భారీ ఎలుగుబంటి కంటే కూడా పెద్దగా ఉండే వీరు హిమాలయాల్లో జీవిస్తుంటారని చెబుతుంటారు. అయితే, ఇందుకు సంబంధించి సరైన శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. యతి గురించి చాలా కాలం క్రితమే ప్రపంచానికి తెలిసింది. ఒకటో శతాబ్దంలోనే యతి గురించి జనాలకు తెలుసని చరిత్ర చెబుతోంది. నేపాల్ కు చెందిన షెర్పాస్ అనే తెగకు చెందిన వ్యక్తులు తొలిసారి యతి ని చూశారని అంటారు. అయితే, కాలక్రమంలో దాని గురించి ఏమీ తెలియకపోయినా అప్పుడప్పుడూ యతి ప్రస్తావన మాత్రం వచ్చేది.
ఇక యతి గురించి 18వ శతాబ్దంలోనే పాశ్చాత్త్య దేశాలకు తెలిసింది. తాను యతిని చూశానని, అయితే, ఫొటో తీసేలోపే అది వెళ్లిపోయిందని రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీకి చెందిన ఎన్ ఏ టొంబాజ్ అనే ఫొటోగ్రాఫర్ 1925లో వెల్లడించారు. అది అచ్చం మనిషిలాగే ఉందని, వడివడిగా అడుగులు వేస్తూ మధ్య మధ్యలో ఆగుతూ ముందుకెళ్తుండగా తాను చూశానని చెప్పాడు. నిమిషం పాటు అది కనిపించిందని, పొటో తీద్దామనుకునే లోగానే వెళ్లిపోయిందని వివరించాడు. దీంతో దాని పాదముద్రలను మాత్రం ఫొటో తీశానని ఆయన వెల్లడించాడు. అప్పటినుంచి యతి గురించి పరిశోధనలు ఎక్కువయ్యాయి. పలువురు ఔత్సాహిక పరిశోధకులు హిమాలయాల్లో యతి గురించి పరిశోధనలు చేశారు. కానీ ఏ ఒక్కరూ కూడా యతి గురించి ఆధారాలు సేకరించలేకపోయారు. దీంతో యతి ఉందా లేదా అనే అంశం అలా మిస్టరీగానే ఉండిపోయింది.
తాజాగా భారత సైన్యం తాము యతి పాదముద్రలు గుర్తించామని ట్వీట్ చేయడంతో మరోసారి యతి వార్తల్లో కనిపించింది. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. యతి అనే జీవి ఉండే అవకాశం లేదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆ పాదముద్రలు భారీ పరిమాణంలో ఉండే ఎలుగుబంటివి అయి ఉండొచ్చని అంటున్నారు. ఎలుగుబంట్లు ఒక్కోసారి వెనుక కాళ్లపై నడుస్తాయని, అప్పుడే ఆ పాదముద్రలు ఏర్పడి ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల ఈ విషయంలో సరైన ఆధారాలు లేకుండా అవి యతి పాదముద్రలే అని నిర్ధారణకు రాకూడదని పేర్కొంటున్నారు. మరి ఈ మిస్టరీ ఎన్నటికి తేలుతుందో చూడాలి.
681780 244933Superb post but I was wanting to know in case you could write a litte a lot more on this subject? Id be extremely thankful in case you could elaborate a bit bit much more. Thanks! 996579
305002 407121What a lovely weblog. Ill surely be back. Please preserve writing! 378694
607664 513907I do not have a bank account how can I location the order? 123599