Switch to English

ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తూ కోటి రూపాయలు సంపాదిస్తున్న యువకుడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? చక్కగా ఆ జాబ్ చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. కానీ రాజస్థాన్ కి చెందిన హరీశ్ ధన్ దేవ్ మాత్రం అలా కాదు. ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, ఆయన సంతృప్తి చెందలేదు. రెండు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం వ్యవసాయంలోకి దిగారు. అంతే అంచలంచెలుగా ఎదిగి కోట్లకు పడగలెత్తారు.

జైసల్మేర్ కి చెందిన ధన్ దేవ్.. 2012లో జైపూర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఢిల్లీలో ఎంబీఏలో చేరారు. ఎంబీఏ చదువుతుండగానే జైసల్మేర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో ఎంబీఏకి పుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరారు. అయితే, ఆ ఉద్యోగం ఆయనకు ఎలాంటి ఆనందం ఇవ్వలేకపోయింది. దీంతో రెండు నెలలకే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సన్నిహితులంతా ధన్ దేవ్ ను తిట్టారు. నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకుని, నష్టాలొచ్చే వ్యవసాయం చేస్తావా అని ప్రశ్నించారు. కానీ ఇవేమీ ఆయన పట్టించుకోలేదు.

ఈ క్రమంలో బికనీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ను కలవడం హరీశ్ జీవితంలో మలుపు తిరగడానికి కారణమైంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఏ పంట పండిస్తే బావుంటుందో చెప్పాలని హరీశ్ అడగ్గా.. ఆయన ఆలోవెరా మొక్కల గురించి వివరించి, ఆ పంట సాగు చేయమని సూచించాడు. దీంతో హరీశ్ ఆలోవెరా పంటను ఆధునిక పద్ధతులతో ఎలా సేద్యం చేయాలో తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి 25వేల ఆలోవెరా మొక్కలను తీసుకొచ్చి తన భూమిలో సేద్యం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఇతర రైతులు హరీశ్ ను హెచ్చరించారు. ఆలోవెరా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, తాము గతంలో ఆ పంట పండించి నష్టపోయిన విషయాన్ని వివరించారు. అయితే, సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్లే ఆ రైతులు నష్టపోయిన విషయాన్ని హరీశ్ గుర్తించారు. దీంతో తన మార్కెటింగ్ వ్యూహాలతో దానిని అధిగమించాలని భావించారు.

అనంతరం జైపూర్ లోని కొన్ని ఏజెన్సీలను సంప్రదించి, ఆలోవెరా ఆకులను వారికి అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఆలోవెరా ఆకుల కంటే దాని రసానికే ఎక్కువ డిమాండ్ ఉన్న సంగతి తెలుసుకుని, తానే సొంతంగా ఆలోవెరా ఆకుల నుంచి పల్ప్ తీసి, మార్కెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన మార్కెటింగ్ ను మరింత విస్తరించాలని నిర్ణయించుకుని అందుకు మార్గాలు అన్వేషించారు.

పెద్ద పరిమాణంలో ఆలోవెరా పల్ప్ ఎవరికి అవసరం అని ఆరా తీయగా.. బాబా రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీయే పెద్ద మొత్తంలో ఆలోవెరా సేకరిస్తోందని హరీశ్ తెలుసుకున్నారు. వారిని సంప్రదించి, ఆలోవెరా పల్ప్ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘నేచురెలో ఆగ్రో’ అనే కంపెనీ కూడా స్థాపించారు. రెండేళ్లుగా పతంజలి కంపెనీకి భారీ పరిమాణంలో ఆలోవెరా పల్ప్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హరీశ్ ధన్ దేవ్ కంపెనీ టర్నోవర్ 3 కోట్లకు చేరింది. నాణ్యత విషయంలో తాము రాజీ పడబోమని, అదే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని హరీశ్ గర్వంగా చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, వ్యవసాయం చేయడం ద్వారా కోటీశ్వరుడు కావడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. హ్యాట్సాఫ్ హరీశ్.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...