Switch to English

ప్రభుత్వ ఉద్యోగం వదిలి వ్యవసాయం చేస్తూ కోటి రూపాయలు సంపాదిస్తున్న యువకుడు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,970FansLike
57,764FollowersFollow

ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? చక్కగా ఆ జాబ్ చేసుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేస్తారు. కానీ రాజస్థాన్ కి చెందిన హరీశ్ ధన్ దేవ్ మాత్రం అలా కాదు. ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, ఆయన సంతృప్తి చెందలేదు. రెండు నెలలకే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం వ్యవసాయంలోకి దిగారు. అంతే అంచలంచెలుగా ఎదిగి కోట్లకు పడగలెత్తారు.

జైసల్మేర్ కి చెందిన ధన్ దేవ్.. 2012లో జైపూర్ లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. తర్వాత ఢిల్లీలో ఎంబీఏలో చేరారు. ఎంబీఏ చదువుతుండగానే జైసల్మేర్ మున్సిపల్ కార్పొరేషన్ లో జూనియర్ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. దీంతో ఎంబీఏకి పుల్ స్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరారు. అయితే, ఆ ఉద్యోగం ఆయనకు ఎలాంటి ఆనందం ఇవ్వలేకపోయింది. దీంతో రెండు నెలలకే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తనకు ఉన్న 120 ఎకరాల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సన్నిహితులంతా ధన్ దేవ్ ను తిట్టారు. నిక్షేపం లాంటి ఉద్యోగం వదులుకుని, నష్టాలొచ్చే వ్యవసాయం చేస్తావా అని ప్రశ్నించారు. కానీ ఇవేమీ ఆయన పట్టించుకోలేదు.

ఈ క్రమంలో బికనీర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ ను కలవడం హరీశ్ జీవితంలో మలుపు తిరగడానికి కారణమైంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఏ పంట పండిస్తే బావుంటుందో చెప్పాలని హరీశ్ అడగ్గా.. ఆయన ఆలోవెరా మొక్కల గురించి వివరించి, ఆ పంట సాగు చేయమని సూచించాడు. దీంతో హరీశ్ ఆలోవెరా పంటను ఆధునిక పద్ధతులతో ఎలా సేద్యం చేయాలో తెలుసుకున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి 25వేల ఆలోవెరా మొక్కలను తీసుకొచ్చి తన భూమిలో సేద్యం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసిన ఇతర రైతులు హరీశ్ ను హెచ్చరించారు. ఆలోవెరా వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, తాము గతంలో ఆ పంట పండించి నష్టపోయిన విషయాన్ని వివరించారు. అయితే, సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్లే ఆ రైతులు నష్టపోయిన విషయాన్ని హరీశ్ గుర్తించారు. దీంతో తన మార్కెటింగ్ వ్యూహాలతో దానిని అధిగమించాలని భావించారు.

అనంతరం జైపూర్ లోని కొన్ని ఏజెన్సీలను సంప్రదించి, ఆలోవెరా ఆకులను వారికి అమ్మేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, ఆలోవెరా ఆకుల కంటే దాని రసానికే ఎక్కువ డిమాండ్ ఉన్న సంగతి తెలుసుకుని, తానే సొంతంగా ఆలోవెరా ఆకుల నుంచి పల్ప్ తీసి, మార్కెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన మార్కెటింగ్ ను మరింత విస్తరించాలని నిర్ణయించుకుని అందుకు మార్గాలు అన్వేషించారు.

పెద్ద పరిమాణంలో ఆలోవెరా పల్ప్ ఎవరికి అవసరం అని ఆరా తీయగా.. బాబా రాందేవ్ కు చెందిన పతంజలి కంపెనీయే పెద్ద మొత్తంలో ఆలోవెరా సేకరిస్తోందని హరీశ్ తెలుసుకున్నారు. వారిని సంప్రదించి, ఆలోవెరా పల్ప్ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘నేచురెలో ఆగ్రో’ అనే కంపెనీ కూడా స్థాపించారు. రెండేళ్లుగా పతంజలి కంపెనీకి భారీ పరిమాణంలో ఆలోవెరా పల్ప్ సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హరీశ్ ధన్ దేవ్ కంపెనీ టర్నోవర్ 3 కోట్లకు చేరింది. నాణ్యత విషయంలో తాము రాజీ పడబోమని, అదే తమను ఈ స్థాయికి తీసుకొచ్చిందని హరీశ్ గర్వంగా చెబుతారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి, వ్యవసాయం చేయడం ద్వారా కోటీశ్వరుడు కావడమే కాకుండా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. హ్యాట్సాఫ్ హరీశ్.

2 COMMENTS

సినిమా

BIGG BOSS 9 TELUGU E87: ఫైనలిస్ట్ ల పోటీలో చతికిల...

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా ఫైనలిస్ట్ రేస్ హంగామాతో సందడి చేసింది. గ్రాండ్ ఫి నాలే దగ్గరపడుతుండడంతో హౌస్‌లోని ప్రతి సభ్యుడు...

“ఆంధ్ర కింగ్ తాలూకా” కి ప్రేక్షకులు, రివ్యూవర్స్ ఇచ్చిన రెస్పాన్స్ అద్భుతం:...

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ థియేటర్స్‌లో దుమ్మురేపుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఈ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ నవంబర్ 27న విడుదలైనప్పటి నుంచి హౌస్‌ఫుల్ షోలను...

యధార్థ సంఘటనల ఆధారంగా “విధాత”.. త్వరలో.

విధాత సినిమా తొలి కాపీ సిద్ధమైంది. Abc ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం వహించగా, నిర్మాతగా అప్పిని పల్లె...

హైదరాబాద్‌కి కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్… ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం...

న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌...

BIGG BOSS 9 TELUGU E86: ఎమోషన్‌తో పాటు అగ్నిలా మండిన...

బిగ్ బాస్ సీజన్ 9 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా డ్రామా, ఎమోషన్, అండ్ పక్కా మసాలాతో నిండిపోయింది. సాధారణ నామినేషన్స్ అనుకున్న ఇంటి సభ్యులు… ఈ...

రాజకీయం

పవన్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం, క్షమాపణలు కోరుతూ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ‘తెలంగాణ దిష్టి’ వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు మరియు కాంగ్రెస్ ప్రముఖ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

మొంథా తుపాను నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షా కు వివరించిన లోకేష్–అనిత

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మొంథా తుపాను భారీ నష్టాన్ని మిగిల్చిందని మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నివేదికతో వివరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ...

ఢిల్లీ పర్యటనలో లోకేష్, అనిత – కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఢిల్లీకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ మరియు హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని...

పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళ స్నేహం.! రాష్ట్రం కోసమేనన్న చంద్రబాబు.!

ఎన్డీయే కూటమి పదిహేనేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో వుండాలని పదే పదే ఆకాంక్షిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం, జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి...

ఎక్కువ చదివినవి

తిరుపతిలో నకిలీ సీఐ హల్‌చల్… శివయ్య బాగోతం బట్టబయల్!

తిరుపతి జిల్లాలో నకిలీ సీఐ శివయ్య చేస్తున్న హడావిడి పెద్ద సెన్సేషన్‌గా మారింది. రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సీఐగా పనిచేస్తున్నానంటూ పెద్దగా వేషాలు వేసిన శివయ్య, చినగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లిలో ఓ...

మంగళగిరిలో లోకేశ్ 76వ రోజు ప్రజాదర్బార్‌లో వినతుల వర్షం

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన 76వ రోజు ప్రజాదర్బార్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ప్రతి ఒక్కరినీ...

అమరావతిలో 15 బ్యాంకుల శంకుస్థాపన… లోకేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

అమరావతి మరోసారి అభివృద్ధి వేగాన్ని అందుకుంది. అమరావతిలో ఒక్కరోజులోనే 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం...

లోకేష్ చేతులమీదుగా మంగళగిరిలో మోడల్ లైబ్రరీ ప్రారంభం

విద్యా వాతావరణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మంత్రి నారా లోకేష్ మరో కీలక అడుగు వేశారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద రూ.1.72 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని...

కోనసీమ కొబ్బరి రైతులకు పవన్ కల్యాణ్ భరోసా

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పరిధిలో నష్టపోయిన కొబ్బరి తోటలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజోలు నియోజకవర్గం కేశవదాసుపాలెం ప్రాంతంలో...