ప్రాణాంతక కరోనా వైరస్ పై పోరులో భాగంగా ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడానికి కారణమేంటి? 14 గంటలపాటు బయటకు రాకుండా ఉంటే వైరస్ ను నిరోధించొచ్చా? అసలు జనతా కర్ఫ్యూ వెనుక కథాకమామీషు ఏమిటి? ప్రస్తుతం వీటిపైనే చర్చ సాగుతోంది. కరోనా వైరస్ ను నివారించడానికి ఎలాంటి మందూ లేదు. అది రాకుండా చూసుకోవడం ఒక్కటే మార్గం. అందుకే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచనలు చేస్తున్నారు. అంటే మనిషికీ మనిషీకి మధ్య కనీస దూరం ఉండాలన్నమాట.
ఈ నేపథ్యంలో మోదీ ప్రతిపాదించిన జనతా కర్ఫ్యూ ఎలా వర్కవుట్ అవుతుంది? ఏదైనా ఉపరితలంపై కరోనా వైరస్ జీవితకాలం గంటల్లోనే ఉంటుంది. గాలిలో అది మూడు గంటల్లోపు, రాగి వస్తువులపై నాలుగు గంటల్లోపు, కార్డ్ బోర్డులపై 24 గంటల వరకు, స్టీల్, ప్లాస్టిక్ వస్తువులపై 72 గంటల వరకు జీవించి ఉంటుందని ఓ అంచనా. అంటే ఆయా సమయాల్లోగా ఎవరైనా వాటిని తాకి, ఆ చేతులను కళ్లు, ముక్కు, నోటి దగ్గర పెట్టుకుంటే వారికి ఆ వైరస్ సోకుతుంది. దీనిని నిరోధించేందుకు జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుంది. 14 గంటలపాటు జనమంతా ఇంట్లోనే ఉంటే, బయట ఎక్కడైనా వైరస్ ఉన్నప్పటికీ, అది జనాలకు సోకే అవకాశం ఉండదు.
మరోవైపు ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ రెండో దశలో ఉంది. ఇది మూడో దశలోకి ప్రవేశిస్తే దానిని నిరోధించడం కష్టం. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే కొన్ని వారాలపాటు జనతా కర్ఫ్యూ పాటించాల్సిందే. భారత్ వంటి దేశంలో అది చాలా క్లిష్టమైన అంశం. పైగా రోజుల తరబడి ఇంటికే పరిమితం కావడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో ఈ ఆదివారం ఒక్కరోజు అలా ఉండగలిగితే.. తదుపరి రోజుల్లో ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ప్రధాని మోదీ 14 గంటల జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. సో.. ఈ ఆదివారం అందరూ ఇళ్లకే పరిమితం కండి.. ప్రమాదరక వైరస్ ను తరిమి కొట్టండి.
148385 138592How significantly of an appealing guide, maintain on producing far better half 858051
6406 481643This internet site is my aspiration, really superb design and Perfect articles. 889986
154618 630708As being a Newbie, Were permanently exploring online for articles which can be of aid to me. Many thanks 103364