తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ ఇంకా బుల్లి తెరకు చెందిన పలువురు నటీనటులు కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఇటీవలే సూపర్ మచ్చి చిత్రం షూటింగ్లో పాల్గొన్న చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా భయంతో రెండు వారాల పాటు కుటుంబ సభ్యులకు పూర్తి దూరంగా ఉన్నాడు. సూపర్ మచ్చి చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడం వల్లే చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా అర్థాంతరంగా షూటింగ్ ను ఆపేసి స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయారు.
కరోనా భయంతో దాదాపు రెండు వారాల పాటు స్వీయ నిర్భందంలో ఉన్న కళ్యాణ్ కూతురు పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొనలేక పోతున్నందుకు చాలా బాధగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. రెండు వారాల తర్వాత ఇటీవల కరోనా టెస్టు చేయించుకున్న కళ్యాణ్ దేవ్ నెగటివ్ అంటూ రావడంతో పిల్లలు ఇంకా భార్యను దగ్గరకు తీసుకున్నాడు. వారితో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
హీరోగా మొదటి చిత్రంతో నిరాశ పర్చిన కళ్యాణ్ దేవ్ రెండవ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం చాలా గ్యాప్ తర్వాత సూపర్ మచ్చి చిత్రానికి కమిట్ అయ్యాడు. సగానికి పైగా చిత్రం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉందనుకుంటుండగా కరోనా కారణంగా ఆగిపోయింది. కాస్త లేట్ అయిన సూపర్ మచ్చితో కళ్యాణ్ మొదటి సక్సెస్ ను దక్కించుకుంటాడా చూడాలి.
789890 66210I consider something actually special in this web site . 146467
630717 296885This really is a very good subject to speak about. Sometimes I fav stuff like this on Redit. This article probably wont do nicely with that crowd. I is going to be positive to submit something else though. 371805