టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఫైర్ అయ్యారు. ఈవో ఇంకా చంద్రబాబు ఆజ్ఞలే పాటిస్తూ హకోర్టు తీర్పును, జగన్ హామీని పట్టించుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటారని వేచే చూస్తున్న తమకు ఎదురు చూపులే మిగులుతున్నాయని అన్నారు. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
‘చంద్రబాబు అన్యాయంగా 20మందికి పైగా వారసత్వం అర్చకులను తొలగించారు. అప్పటి తమ న్యాయపోరాటంలో హైకోర్టు తమను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. జగన్ కూడా తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ.. ఈవో, ఏఈవో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే పాటిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలను ట్యీగ్ చేశారు.
ఆధ్యాత్మికంగానూ, ఆదాయంలోనూ, భక్తుల ఆరాధనలోనూ, పవిత్రతలోనూ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇంతటి పవిత్ర స్థలంలో ఒక్కోసారి రాజకీయాలు కలకలం రేపుతూ ఉంటాయి. రెండేళ్ల క్రితం ఇదే జరిగింది. తితిదేలో వారసత్వ అర్చకంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు వేసి ప్రధానార్చకులు రమణ దీక్షితులును తొలగించింది. ఈ అంశం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ప్రస్తుతం రమణ దీక్షితులు ట్వీట్ తో రాజకీయంగా కలకలం రేపుతోంది.
439966 358952There will be several totally different portions about the LA Weight reduction eating program and 1 is actually important. Begin stage is your really truly of these extra load. weight loss 191411