రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు లక్ష ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడ్డారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు ఆరోపించిన విషయం విదితమే. ‘లక్ష ఎకరాలు.. లక్షల కోట్ల కుంభకోణం..’ అంటూ వైఎస్ జగన్ మోహన్రెడ్డి కూడా అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో రాజకీయ ఆరోపణలు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక.. వైఎస్ జగన్, ఇప్పటిదాకా ఒక్క టీడీపీ నేత మీద కూడా అవినీతి ఆరోపణలుగానీ, అమరావతిలో ఒక్క ఎకరా భూ కుంభకోణం జరిగిందనిగానీ నిజాలు నిగ్గు తేల్చలేకపోయారు.
ఏడు నెలల పాలన అనంతరం, ఇప్పుడు తీరిగ్గా ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున మళ్ళీ ఆరోపణలు చేయిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. ఈ మధ్యనే క్యాబినెట్ భేటీలో మంత్రుల కమిటీ ఒకటి ఇన్సైడర్ ట్రేడింగ్పై నివేదిక గురించిన చర్చ వచ్చింది. ఇప్పుడేమో పార్టీ తరఫున ఇన్సైడర్ ట్రేడింగ్పై ఓ వీడియో వైసీపీ నేతలు విడుదల చేశారు.
ఇంతలా ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన వివరాలున్నప్పుడు, కేసులు నమోదు చేయించేసి.. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని ఎంచక్కా అరెస్ట్ చేసెయ్యొచ్చు. కానీ, అందుకు సాహసించలేకపోతోంది వైఎస్ జగన్ సర్కార్. ‘దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి..’ అంటూ టీడీపీ నేతలు చాలామంది మీసం మెలేస్తున్నారు.. తొడకొట్టి మరీ సవాల్ విసురుతున్నారు.
కానీ, అధికార పార్టీ నేతల్లో ‘పౌరుషం’ కన్పించకపోవడం గమనార్హం. కృష్ణా నది ఒడ్డున అక్రమ కట్టడం.. అంటూ చంద్రబాబు ఇంటి మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన యాగీ చూశాం. ప్రజా వేదికను కూల్చేసిన జగన్ సర్కార్, ఇప్పటిదాకా చంద్రబాబు నివాసం వుంటోన్న ఇంటి గేటుని కూడా తాకలేకపోయింది. ఇదీ జగన్ సర్కార్ చిత్తశుద్ధి. ఇలాంటి ప్రభుత్వం, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో కొండని తవ్వి ఎలకని అయినా పట్టుకుంటుందని ఎవరు మాత్రం విశ్వసించగలరు.?
249520 851273I surely enjoyed the method that you explore your experience and perception of the location of interest 263838