త్వరలోనే ఆంద్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. పురపాలకసంఘాలు, పంచాయితీలు అన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎపి సర్కార్ సిద్ధం అవుతున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడబోతున్నది. ఈ నోటిఫికేషన్ వెలువడేలోపుగానే ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేయడానికి వైకాపా ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. ఇందులో భాగంగానే వైకాపా రాజధాని అంశాన్ని స్పీడ్ పెంచింది.
దీంతో పాటుగా రేషన్ కార్డుల రీ వెరిఫికేషన్, పెన్షన్లు అన్నింటిని ఫిబ్రవరి 20 తేదీలోగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. ఒక నెల పెన్షన్ అందని వాళ్లకు రెండు నెలల పెన్షన్ ఇచ్చేలా చూస్తున్నారు. వీటితో పాటు ఎన్నికలు పూర్తయ్యాక పేదలకు ఇళ్ల స్థానాలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిని ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి నిన్నటి రోజున జగన్ మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
అక్కడితో ఆగకుండా జగన్ మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఈ నిర్ణయాలు దేనికోసం అంటే, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు డబ్బు, మద్యం కట్టడి చేసేవిధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యంతో పట్టుబడితే ఆ అభ్యర్థి ఎన్నికల నుంచి తప్పించేలా చట్టం తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. ఈ నిర్ణయం వెనుక లోతైన కారణం ఉన్నది.
పురపాలక, పంచాయతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది. డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు ప్రజలను లోనుచేసి ఓట్లు దండుకోవచ్చు. అందుకే ఆ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి జగన్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. దీని వలన వైకాపాకు కూడా ఇబ్బందులు వస్తాయి. కానీ, టీడీపీని అడ్డుకోవాలి అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని అంటున్నారు నిపుణులు.
400449 159300Awesome read , Im going to spend more time researching this topic 234677
478835 353457Dead written articles , appreciate it for entropy. 854161
796153 270445Glad to be one of a lot of visitants on this awesome web site : D. 27175