అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికల్లో ‘వై నాట్ 175’ అంటోంది. 175 సంగతి తర్వాత.. ముందైతే, 2019 ఎన్నికల్లో గెలిచిన 151 సీట్లైనా వైసీపీ నిలబెట్టుకుంటుందా.? కనీసం అందులో సగం అయినా మళ్ళీ గెలవగలుగుతుందా.? ఇలా చాలా ప్రశ్నలు వైసీపీలోనే అంతర్మధనానికి గురిచేస్తున్నాయి.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలాకాలం క్రితమే సొంత పార్టీపైన తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించలేని అచేతనావస్థ వైసీపీ అధినాయకత్వానిది.
డేరింగ్ అండ్ డాషింగ్ జగన్.. అని వైసీపీ ముఖ్య నేతలు తరచూ చెబుతుంటారు. రఘురామకృష్ణరాజుని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వైఎస్ జగన్ ఎందుకు ఆ డైనమిజం చూపించలేకపోతున్నారు.?
అన్నట్టు, కొత్తగా ఇంకో నిరసనగళం షురూ అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, వైసీపీ అధినాయకత్వానికి ఎదురు తిరుగుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో అసలు అభివృద్ధి జరగలేదని తెగేసి చెబుతున్నారాయన. ఏ మొహం పెట్టుకుని జనాన్ని మళ్ళీ ఓట్లు అడుగుతామని కూడా ప్రశ్నిస్తున్నారు ఆనం.
‘రోడ్ల దుస్థితి చూస్తే ఎవడైనా మళ్ళీ వైసీపీకి ఓటేస్తాడా.?’ అని ఆనం రాంనారాయణరెడ్డి నిలదీస్తున్న వైనాన్ని వైసీపీలోనే అంతర్గతంగా చాలామంది సమర్థించక తప్పని పరిస్థితి. ఎందుకంటే, ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు తమ సొంత నియోజకవర్గాల్లో రోడ్ల మీద తిరగాల్సి వస్తే నరకం చూస్తున్నారు.. జనం నుంచి ఛీత్కారాల్ని ఎదుర్కొంటున్నారు.
రఘురామ, ఆనంతో కథ ముగిసిపోదు.. అసలు కథ ముందుంది. సంక్రాంతి తర్వాత వైసీపీలో ముసలం తీవ్రస్థాయికి చేరబోతోంది. 60 శాతానికి పైగా ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదంటూ సొంత సర్వేలు చెబుతున్న దరిమిలా, వాళ్ళంతా పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, టిక్కెట్ల విషయమై వారి ‘మెడ మీద కత్తి’ వేలాడుతోంది మరి.!
665220 515727Thank you for your quite good info and respond to you. 81951
712489 31234This internet site is often a walk-through like the info you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and you will undoubtedly discover it. 340440
337881 143141Hi there, i just thought i would publish and now let you know your websites style is actually smudged within the K-Melon browser. Anyhow sustain in the really good work. 211940