తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్కి వైఎస్ జగన్ సర్కార్ పెద్ద షాకే ఇచ్చింది. గల్లా జయదేవ్కి చెందిన అమర్రాజా సంస్థకు చాలాకాలం క్రితం అప్పటి ప్రభుత్వం కొంత భూమిని కేటాయించింది.. పరిశ్రమ విస్తరణ కోసం. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలకు ‘పారిశ్రామిక అభివృద్ధి’ పేరుతో భూములు కేటాయించడం కొత్తేమీ కాదు. అయితే, ఇన్నేళ్ళ తర్వాత.. ఇప్పుడు ఆ భూముల్లోంచి సుమారు 250 ఎకరాల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేసింది.
పారిశ్రామిక అభివృద్ధి – పరిశ్రమ విస్తరణ పేరుతో భూముల్ని తీసుకున్న అమర్రాజా సంస్థ, ఇప్పటికీ అక్కడ ఎలాంటి పరిశ్రమల నిర్మాణం చేయలేదనీ, ఎవరికీ కొత్తగా ఉపాధి కల్పించలేదని పేర్కొంటూ సంస్థకి కేటాయించిన భూముల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ జీవో విడుదల చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం.
నిజానికి, ఈ వ్యవహారంపై ఎంపీ గల్లా జయదేవ్ కొద్ది రోజుల క్రితమే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. మా ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోంది..’ అంటూ జగన్ సర్కార్పై ఆరోపణలు చేశారు గల్లా జయదేవ్ కొద్ది రోజుల క్రితం. పలువురు టీడీపీ నేతల్ని అధికార పార్టీ ఇదే తరహాలో బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతోందనీ, కొందరు ఆ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గుతున్నారనీ, మరికొందర్ని అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందనీ టీడీపీ ఆరోపిస్తోన్న విషయం విదితమే.
అయితే, ఇన్నేళ్ళలో అమర్రాజా సంస్థ, ప్రభుత్వం నుంచి భూముల్ని పొంది కూడా అక్కడ ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధి ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు గల్లా కుటుంబం సమాధానమివ్వాల్సి వుంటుంది. గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారి గతంలో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నుంచి గల్లా కుటుంబం టీడీపీలో చేరిన విషయం విదితమే. ఏదిఏమైనా అమర్రాజా సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానూ మంచి గుర్తింపు వుంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అమర్రాజా సంస్థ పట్ల, గల్లా కుటుంబం పట్ల ప్రత్యేకమైన గౌరవం వుందన్నది నిర్వివాదాంశం. మరి, ఈ ఎపిసోడ్పై గల్లా కుటుంబం, అమర్రాజా సంస్థ ఎలా స్పందిస్తాయి.? వెనక్కి తీసుకున్న భూముల్ని ప్రభుత్వం ఏం చేస్తుంది.? అన్నది వేచి చూడాల్సిందే.
51488 435164Intriguing post. Ill be sticking about to hear a lot more from you guys. Thanks! 269639
223951 996486But wanna say that this is very valuable , Thanks for taking your time to write this. 770637