కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కరోనా వైరస్ నేపథ్యంలో జనసేన పార్టీ, బాధ్యతాయుతమైన విపక్షంగా, అధికార పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. నిజానికి, జనసేన నుంచి వచ్చిన ఈ మద్దతుపై అధికార పార్టీ సానుకూలంగా స్పందించాల్సి వుంది. కానీ, అంత విజ్ఞత అధికార పార్టీకెక్కడుంది.?
వైఎస్సార్సీపీ నేతలు, పనిగట్టుకుని మరీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అవాకులు చెవాకులూ పేలుతున్నారు.. కరోనా వైరస్ కారణంగా వెతలు పడుతున్న ప్రజల సంగతి పక్కన పెట్టి మరీ. గ్రామ వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నప్పుడు, వారి ద్వారా రేషన్ కూడా సరఫరా చేస్తే.. జనం రేషన్ కోసం క్యూ లైన్లలో నిలబడే బాధ తప్పుతుంది కదా.? అని జనసేన ప్రశ్నించింది. దానిపై అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
అవన్నీ పక్కన పెడితే, ఇతర రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసుల గురించి సోషల్ మీడియా వేదికగా జనసేనాని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ‘ట్యాగ్’ చేస్తున్నారు. జనసేనాని విజ్ఞప్తికి కేంద్రం స్పందిస్తోంది. ఇదే, ఇక్కడే అధికార పార్టీ, జనసేనానికి వస్తున్న మైలేజీని తట్టుకోలేకపోతోంది. ‘మీ ఓవరాక్షన్ ఏంటి.?’ అంటూ అధికార పార్టీ నేతలు, జనసేనానిపై ఎదురు దాడికి దిగుతున్నారు.
అయితే, ఇప్పటిదాకా తనను విమర్శిస్తోన్న అధికార పార్టీ నేతలపై జనసేనాని స్పందించింది లేదు. ప్రజలకు మేలు చేసే క్రమంలో తనకు పదవి లేకపోయినా, తనకున్న అవకాశాల మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననే మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘రాజకీయాలు తర్వాత.. ముందైతే ప్రజల్ని ఆదుకోవాలి..’ అనే ఖచ్చితమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ ముందడుగు వేస్తుండడాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే.
తాజాగా గుజరాత్లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం జనసేనాని సోషల్ మీడియా వేదికగా, గుజరాత్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. గుజరాత్ ప్రభుత్వం కూడా స్పందించింది. సోషల్ మీడియా వేదికగా, జనసైనికుల ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టికి బాధితులు తమ వెతల గురించిన సమాచారం చేరవేస్తున్నారు. ఆ సమస్యల్ని జనసేనాని సోషల్ మీడియా ద్వారా ప్రస్తావిస్తున్నారు. పాపం, అధికార వైఎస్సార్సీపీకి జనసేనాని ‘ట్వీట్లు’, పెద్ద ‘పోటు’నే తెచ్చిపెడుతున్నట్లున్నాయి.
Dear @PawanKalyan Garu,Kanna garu also spoke to me a while ago on this. I have just spoken to Chief Secretary, Gujarat Shri Anil Mukim. He assured me that adequate rations, food will be arranged for fishermen from AP & that he would speak to Dist Collector immediately @BJP4Andhra https://t.co/fzETT8na7Z
— GVL Narasimha Rao (@GVLNRAO) April 3, 2020
555816 131621I like your writing style really loving this internet internet site . 817780