దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణతో అన్ని రాష్ట్రాల్లో స్కూల్స్ మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా పదో తరగతి పరీక్షలతో పాటు మరికొన్ని పరిక్షలు కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూల్స్ ఎప్పటి నుంచి తెరుస్తారన్న ఊహాగానాలకు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో సెప్టెంబర్ నుంచి స్కూల్స్ ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న సీఎం ఈ వివరాలు వెల్లడించారు.
స్కూళ్లల్లో నాడు-నేడు, వ్యవసాయం, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై జగన్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్ పాఠశాలల విషయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు-నేడు పనులు ఆగస్టు 31 నాటికి పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు తీసుకొచ్చిన సాగు ఒప్పందాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల నిర్మాణ కోసం స్థలాలను గుర్తించాలని సూచించారు.
రీసెంట్ గా కేంద్రం అన్ని రాష్ట్రాలతో జరిపిన వీడియో కాన్ఫరెన్సులో స్కూల్స్ ప్రారంభంపై వివరాలు, అభిప్రాయాలు కోరింది. ఆ సమయంలో కూడా సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని కేంద్రానికి తెలపింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగష్టు నెలలో ప్రారంభించాలని భావించినా కరోనా తీవ్రత దృష్ట్యా సెప్టెంబర్ 5కు మార్చింది.
902430 444954never saw a web site like this, relaly impressed. compared to other blogs with this article this was definatly the very best web site. will save. 848341
68939 578891I havent checked in here for some time as I thought it was getting boring, but the last couple of posts are great quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 389486