‘‘రాజధాని ఎక్కడో కేంద్రం నిర్ణయించింది.. కాదనడానికి సీఎం ఎవరు? గతంలో హిట్లర్ కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. మండలి నడపటానికి ఏటా రూ.60 కోట్లు ఖర్చవుతున్నాయని రద్దు చేస్తానంటున్నారు. మరి అసెంబ్లీ నడపటానికి కూడా ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది. అలా అని దానిని కూడా రద్దు చేస్తారా? అయినా మండలిని రద్దు చేయడం వీళ్ల చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం తీర్మానం మాత్రమే చేసి పంపిస్తంది. దానిని ఆమోదించాలా.. వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వ ఇష్టం’’ – ఇవీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు.
ప్రస్తుతం వీటిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన యనమల చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. మండలి కొనసాగించాలా.. వద్దా అనేది రాష్ట్రం ఇష్టమే. దానిని ఆమోదించాల్సింది పార్లమెంటు అయినప్పటికీ, మండలి మాకు అవసరం లేదు అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తీర్మానం చేసి పంపిస్తే.. పార్లమెంటు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ ఇలాగే మండలి రద్దుపై తీర్మానం చేసి పంపిస్తే.. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కాంగ్రెస్ కే నష్టం చేకూరుస్తుందని తెలిసినా.. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి, అసెంబ్లీ తీర్మానానికి గౌరవం ఇచ్చి రాజీవ్ గాంధీ మండలి రద్దుకు ఆమోదం తెలిపారు. అనంతరం వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మండలిని పునరుద్ధరించారు. తాజాగా దానిని రద్దు చేసే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలా లేక తిరస్కరించాలా అన్నది మాత్రం కేంద్రం ఇష్టం. ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొంటున్నారు.
ఇక ఏపీ రాజధానిని నిర్ణయించింది కేంద్రం కాదని.. తెలుగుదేశం ప్రభుత్వమే అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అని అనేక లీకులిచ్చి, తాము భూములు కొనేశాక అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. అసలు కేంద్రం అమరావతిని గుర్తించనేలేదని, ఇటీవల కొత్తగా విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని రాజధానిగా పేర్కొనకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై గెజిట్ జారీచేసిన తర్వాతే కేంద్రం దానిని గుర్తిస్తుందనే సంగతి తెలియదా అని యనమలను ప్రశ్నిస్తున్నారు. పైగా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. పార్టీపరంగా మాత్రమే తాము ఈ విషయంలో స్పందిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోదని ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టంచేసిన విషయం మరచిపోయారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.
ఇక మండలిని రద్దు చేయాలనుకున్నట్టే, శాసనసభను కూడా రద్దు చేస్తారా అని రెండింటికీ తేడా తెలియకుండా యనమల మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ‘‘ఎమ్మెల్యేలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. పాలన సాగాలంటే అసెంబ్లీ ఉండాలి. కానీ శాసనమండలి అనేది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమే. అది లేకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనమండలి లేనేలేదు’’ అని పేర్కొన్నారు. అలాంటి శాసనసభను మండలితో పోల్చి రద్దు చేస్తారా అని ప్రశ్నించడం ఏమిటని మండిపడుతున్నారు.
334303 120597hi and thanks for the actual weblog post ive recently been searching regarding this specific advice on-line for sum hours these days as a result thanks 565791
670176 525204Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You clearly know what youre talking about, why waste your intelligence on just posting videos to your site when you could be giving us something enlightening to read? 952141
141175 876039Speedily and easily build your web traffic and PR, which provides Internet website visitors to add your page to any social bookmarking internet site. 603392
573524 923106There is an ending. Just remember that I meant for this to be an art game. I do feel like I spent an inordinate amount of time on the far more traditional gameplay elements, which may make the meaning of the game a bit unclear. In case you mess about with it though, youll uncover it. 437297
228631 96619My plate is real full and your tryna give me much more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 478468