Switch to English

యనమల.. ఏంటి సార్ ఇలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

‘‘రాజధాని ఎక్కడో కేంద్రం నిర్ణయించింది.. కాదనడానికి సీఎం ఎవరు? గతంలో హిట్లర్ కూడా ఇలాగే వ్యవహరించి చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. మండలి నడపటానికి ఏటా రూ.60 కోట్లు ఖర్చవుతున్నాయని రద్దు చేస్తానంటున్నారు. మరి అసెంబ్లీ నడపటానికి కూడా ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది. అలా అని దానిని కూడా రద్దు చేస్తారా? అయినా మండలిని రద్దు చేయడం వీళ్ల చేతిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం తీర్మానం మాత్రమే చేసి పంపిస్తంది. దానిని ఆమోదించాలా.. వద్దా అన్నది కేంద్ర ప్రభుత్వ ఇష్టం’’ – ఇవీ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు.

ప్రస్తుతం వీటిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన యనమల చేసిన వ్యాఖ్యలు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయని అంటున్నారు. మండలి కొనసాగించాలా.. వద్దా అనేది రాష్ట్రం ఇష్టమే. దానిని ఆమోదించాల్సింది పార్లమెంటు అయినప్పటికీ, మండలి మాకు అవసరం లేదు అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తీర్మానం చేసి పంపిస్తే.. పార్లమెంటు దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ ఇలాగే మండలి రద్దుపై తీర్మానం చేసి పంపిస్తే.. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం కాంగ్రెస్ కే నష్టం చేకూరుస్తుందని తెలిసినా.. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి, అసెంబ్లీ తీర్మానానికి గౌరవం ఇచ్చి రాజీవ్ గాంధీ మండలి రద్దుకు ఆమోదం తెలిపారు. అనంతరం వైఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మండలిని పునరుద్ధరించారు. తాజాగా దానిని రద్దు చేసే దిశగా జగన్ ఆలోచనలు చేస్తున్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించాలా లేక తిరస్కరించాలా అన్నది మాత్రం కేంద్రం ఇష్టం. ఈ విషయం అందరికీ తెలుసని పేర్కొంటున్నారు.

ఇక ఏపీ రాజధానిని నిర్ణయించింది కేంద్రం కాదని.. తెలుగుదేశం ప్రభుత్వమే అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని అని అనేక లీకులిచ్చి, తాము భూములు కొనేశాక అమరావతిని రాజధాని ప్రాంతంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. అసలు కేంద్రం అమరావతిని గుర్తించనేలేదని, ఇటీవల కొత్తగా విడుదల చేసిన మ్యాప్ లో అమరావతిని రాజధానిగా పేర్కొనకపోవడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై గెజిట్ జారీచేసిన తర్వాతే కేంద్రం దానిని గుర్తిస్తుందనే సంగతి తెలియదా అని యనమలను ప్రశ్నిస్తున్నారు. పైగా రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. పార్టీపరంగా మాత్రమే తాము ఈ విషయంలో స్పందిస్తామని, కేంద్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోదని ఇప్పటికే బీజేపీ నేతలు స్పష్టంచేసిన విషయం మరచిపోయారా అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు.

ఇక మండలిని రద్దు చేయాలనుకున్నట్టే, శాసనసభను కూడా రద్దు చేస్తారా అని రెండింటికీ తేడా తెలియకుండా యనమల మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ‘‘ఎమ్మెల్యేలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. పాలన సాగాలంటే అసెంబ్లీ ఉండాలి. కానీ శాసనమండలి అనేది కేవలం రాజకీయ పునరావాస కేంద్రం మాత్రమే. అది లేకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో శాసనమండలి లేనేలేదు’’ అని పేర్కొన్నారు. అలాంటి శాసనసభను మండలితో పోల్చి రద్దు చేస్తారా అని ప్రశ్నించడం ఏమిటని మండిపడుతున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...