రాజకీయాల్లో పాలాభిషేకాలు చాలా కామన్. గతంలో సినిమా హీరోల ఫొటోలకి, కటౌట్లకి పాలాభిషేకాలు జరిగేవి.. ఇప్పుడు కూడా జరుగుతున్నాయిగానీ.. రాజకీయ నాయకులకి జరిగే పాలాభిషేకాలు ఎక్కువైపోవడంతో, సినీ హీరోలకు పాలాభిషేకాలు జరిగినా, అవంత హైలైట్ కావడంలేదు. కొత్తగా రాజకీయ నాయకులకి ఇంకో ‘అభిషేకం’ జరుగుతోంది. ఇది నిజంగానే సరికొత్త అభిషేకం. దాని పేరేంటో తెలుసా.? ‘మూత్రాభిషేకం’.
అవును, మీరు చదువుతున్నది కరెక్టే. ఓ మంత్రిగారి ఫొటోకి జరిగింది ఈ మూత్రాభిషేకం. అదీ ఆంధ్రప్రదేశ్లో. సదరు మంత్రిగారు, మండలి ఛైర్మన్ని ఉద్దేశించి ‘నువ్వు సాయిబుకే పుట్టావా.?’ అని అన్నారట. దానిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మైనార్టీ సోదరులు, సదరు మంత్రిగారి ఫొటోకి మూత్రాభిషేకం చేసేశారు. ఓ చిన్న పిల్లాడితో.. డైరెక్ట్గా మంత్రిగారి ఫొటో మీద నిరసనకారులు మూత్రాభిషేకం చేయించారు. రాజకీయాల్లో దీన్ని నయా ట్రెండ్గా భావించాలేమో.!
ఇకపై నిరసనకారులు తమ నిరసనల్ని మూత్రాఫభిషేకాలతో చూపించబోతున్నారన్నమాట. ‘సిగ్గు సిగ్గు..’ అని జనం సిగ్గుపడొచ్చు.. కానీ, రాజకీయ నాయకులు మాత్రం సిగ్గు లేకుండానే వ్యవహరిస్తారు. అదే మరి రాజకీయమంటే. అయినా, మండలి ఛైర్మన్ని పట్టుకుని అంత తీవ్రమైన పదజాలాన్ని ఓ మంంత్రి ఉపయోగించడమేంటి.? క్రికెట్లో స్లెడ్జింగ్ ఇలాగే జరుగుతుంటుంది. అది ఆట. కానీ, ఇది రాజకీయం. రాజకీయమంటే బాధ్యతతో కూడిన వ్యవహారం. పైగా, చట్ట సభల సాక్షిగా ఈ ఘోరం జరిగిపోయింది.
ఒకవేళ మండలి ఛైర్మన్ గనుక తలచుకుంటే, ప్రివిలేజ్గా తీసుకుంటే.. సదరు మంత్రిగారి పరిస్థితేంటి.? ‘అబ్బే, నేను అలా అన్లేదు..’ అని మంత్రిగారు చెబుతున్నారుగానీ, ప్రత్యక్ష సాక్షులు మాత్రం.. ‘ఆయన నోరు జారేశారు..’ అని చెబుతున్నారు. అలా చెబుతున్నవారిలో అధికార పార్టీ నేతలు కూడా వుండడం గమనార్హం. సో, మంత్రిగారి నోటి దూల నిజమే అయితే, మూత్రాభిషేకానికి ఆయన అర్హుడే.
429408 627615Im often to blogging and i in actual fact respect your content material. The piece has really peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new information. 478331