సోషల్ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని.. తన కుటుంబం మానసిక క్షోభ అనుభవించేలా చేస్తున్నాడు అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సీనియర్ మహిళ జర్నలిస్ట్ సయ్యదా నాహీదా ఖాద్రీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. ఈమె సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎంబీటీ నేత సయ్యద్ సలీం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. సయ్యద్ సలీంపై దాడికి వందలాది ఎంఐఎం కార్యకర్తలు ప్రయత్నించారు.
తన తల్లి నాహీదా ఖాద్రీ నిద్రమాత్రలు మింగడానికి కారణం సయ్యద్ సలీం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. ఫేస్ బుక్ ద్వారా సయ్యద్ సలీం లైవ్ లోకి వచ్చి మరీ నాహీదా ఖాద్రీపై విమర్శలు చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా పోలీసులు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతు ఉండగా మరో వైపు మహిళ జర్నలిస్టు సయ్యదా నాహీదా ఖాద్రీ ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఓవైసీ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
13221 842519Precisely what I was seeking for, thankyou for putting up. 970900