తెలంగాణ అసెంబ్లీలో సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం పెట్టి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోటీ చేయొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ‘ఉచిత సలహా’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ, అటు బద్వేల్ ఉప ఎన్నిక వేళ.. ఈ ‘సమైక్య’ రాగం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అత్యంత వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని కోరుకుంటున్నారు..’ అని ఇటీవల పార్టీ ప్లీనరీ వేదికపై వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే.
కేసీయార్ గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, ఈసారి అవి మరింత చర్చనీయాంశమయ్యాయి. కారణం, కేసీయార్ వ్యాఖ్యలకు ధీటుగా వైసీపీ స్పందిస్తుండడమే. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే స్పందించారు. తాజాగా మంత్రి పేర్ని నాని స్పందించారు.
అసలు తెలంగాణ అసెంబ్లీలో సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం చేసేంత రిస్క్ కేసీయార్ తీసుకుంటారా.? ఒకవేళ రిస్క్ తీసుకుని తీర్మానం పెడితే ఏమవుతుంది.? నిజానికి, ఆ తీర్మానికి అసలు విలువ వుండదు. ఎందుకంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం సూచన మేరకు తీర్మానం పెడితే.. దాన్ని అసెంబ్లీ తిరస్కరించింది.. సమైక్య తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని చెత్త బుట్టలో పడేసింది కేంద్రం.
సో, ఇప్పుడూ అదే జరగబోతోందన్నమాట. అది తెలిసీ, తెలంగాణ అసెంబ్లీలో కేసీయార్ ఎందుకు తీర్మానం పెడతారు.? అయినా, ఆయన ఏపీ – తెలంగాణ కలిసిపోవాలన్లేదు.. రెండు రాష్ట్రాల్లోనూ గులాబీ పార్టీ వుండాలని జనం కోరుతున్నారు. మరి, వైసీపీ ఎందుకు విషయాన్ని మార్చి చెబుతోంది.? వైసీపీకి ఇలాంటి రాజకీయాలు అలవాటే. కానీ, ఇక్కడ వైసీపీ సెటైర్లు వేస్తోంది కేసీయార్ మీద.! ఇప్పటిదాకా తెరవెనుక కలిసి మెలిసి తిరుగుతున్న వైసీపీ – టీఆర్ఎస్ ఇప్పుడెందుకీ విభజన, సమైక్య రాజకీయాల్ని తెరపైకి తెస్తున్నట్లు.? అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అప్రమత్తంగా వుండాల్సిన సందర్భమిది.. గత అనుభవాల నేపథ్యంలో.
619326 662508I think one of your adverts triggered my browser to resize, you might want to put that on your blacklist. 595443
157312 997783It can be difficult to write about this subject. I believe you did an superb job though! Thanks for this! 317973