ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాత మిత్రులు మళ్లీ కలిసే అవకాశం ఉందా అని విశ్లేషణలు సాగుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడుకోవడమే ఇందుకు కారణం. కరోనా నేపథ్యంలో పలు పార్టీల అధినేతలతో మాట్లాడిన మోదీ.. అనంతరం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడంతో ఈనెల 14న ఉదయం బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా చంద్రబాబే మీడియాకు తెలిపారు.
దీంతో రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలైపోయాయి. ఇక బాబుతో బీజేపీ చెట్టపట్టాలు ఖాయమంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల నుంచి అష్టకష్టాలు పడుతున్న బాబుకు ప్రధాని ఫోన్ చేయడంతో ఇక అంతా మంచే జరుగుతుందని పలువురు జోస్యం చెబుతున్నారు. అయితే, కమలనాథులు పాత విషయాలు మరచిపోయారా అనేది సందేహమే. నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోద్రా అల్లర్ల విషయంలో మోదీని తీవ్రంగా తప్పుబట్టారు.
అలాంటిది మోదీ హవా సాగుతున్న సమయంలో బీజేపీతో పొత్తుకు ఇదే చంద్రబాబు తహతహలాడారు. 2014 ఎన్నికల్లో పలువురి ద్వారా రాయబారం నడిపి ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ బీజేపీకి బైబై చెప్పారు. అప్పటి నుంచి మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైగా మోదీకి వ్యతిరేకంగా కూటమి కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ శ్రేణులు దాడికి కూడా ప్రయత్నించాయి. ఇవన్నీ కమలనాథుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎన్నికల్లో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి రావడంతో బాబుకు తత్వం బోధపడింది.
అప్పటి నుంచి బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయకుండా మళ్లీ దోస్తీకి ప్రయత్నాలు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాని తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ ఎన్నికలనాటి విషయలు మనసులో పెట్టుకున్న కమలనాథులు బాబుకు స్నేహహస్తం ఇవ్వలేదు. పలు పార్టీల అధినేతలకు ఫోన్ చేసిన మోదీ.. చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయలేదు. దీంతో ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నట్టు ఆయన కార్యాలయానికి తెలియజేయడంతో మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో తమకు లైన్ క్లియర్ అయినట్టేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే, అది అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా బాబు చేసిన విమర్శలను మోదీ, షా మరచిపోయే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు ఏపీలో అధికార పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. టీడీపీతో మాత్రం సానుకూల వైఖరి కనబరచడం విశేషం. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు ఒకరకంగా ఉండగా.. జాతీయ స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేం.
681245 504135I observe there is really a lot of spam on this weblog. Do you want help cleaning them up? I may possibly aid in between courses! 912125
892734 217285Oh my goodness! an wonderful write-up dude. Thank you Even so My business is experiencing dilemma with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss dilemma? Anybody who knows kindly respond. Thnkx 247933
769887 304387Hey. Neat post. There is a issue together with your internet site in firefox, and you may want to check this The browser could be the market chief and a large component of other folks will omit your outstanding writing because of this problem. 306265