Switch to English

కమలం, సైకిల్.. మళ్లీ కలిసేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రపంచం కరోనాతో అతలాకుతలం అవుతుంటే.. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాత మిత్రులు మళ్లీ కలిసే అవకాశం ఉందా అని విశ్లేషణలు సాగుతున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో మాట్లాడుకోవడమే ఇందుకు కారణం. కరోనా నేపథ్యంలో పలు పార్టీల అధినేతలతో మాట్లాడిన మోదీ.. అనంతరం చంద్రబాబు ప్రధానికి లేఖ రాయడంతో ఈనెల 14న ఉదయం బాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా చంద్రబాబే మీడియాకు తెలిపారు.

దీంతో రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలైపోయాయి. ఇక బాబుతో బీజేపీ చెట్టపట్టాలు ఖాయమంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల నుంచి అష్టకష్టాలు పడుతున్న బాబుకు ప్రధాని ఫోన్ చేయడంతో ఇక అంతా మంచే జరుగుతుందని పలువురు జోస్యం చెబుతున్నారు. అయితే, కమలనాథులు పాత విషయాలు మరచిపోయారా అనేది సందేహమే. నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోద్రా అల్లర్ల విషయంలో మోదీని తీవ్రంగా తప్పుబట్టారు.

అలాంటిది మోదీ హవా సాగుతున్న సమయంలో బీజేపీతో పొత్తుకు ఇదే చంద్రబాబు తహతహలాడారు. 2014 ఎన్నికల్లో పలువురి ద్వారా రాయబారం నడిపి ఏపీలో బీజేపీ, జనసేనతో పొత్తుపెట్టుకుని విజయం సాధించారు. అనంతరం 2019 ఎన్నికలకు ఏడాది ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ బీజేపీకి బైబై చెప్పారు. అప్పటి నుంచి మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైగా మోదీకి వ్యతిరేకంగా కూటమి కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ తో కూడా చేతులు కలిపారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ శ్రేణులు దాడికి కూడా ప్రయత్నించాయి. ఇవన్నీ కమలనాథుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. ఎన్నికల్లో రెండోసారి కూడా బీజేపీయే అధికారంలోకి రావడంతో బాబుకు తత్వం బోధపడింది.

అప్పటి నుంచి బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయకుండా మళ్లీ దోస్తీకి ప్రయత్నాలు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రధాని తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ ఎన్నికలనాటి విషయలు మనసులో పెట్టుకున్న కమలనాథులు బాబుకు స్నేహహస్తం ఇవ్వలేదు. పలు పార్టీల అధినేతలకు ఫోన్ చేసిన మోదీ.. చంద్రబాబుకు మాత్రం ఫోన్ చేయలేదు. దీంతో ప్రధానితో మాట్లాడాలని అనుకుంటున్నట్టు ఆయన కార్యాలయానికి తెలియజేయడంతో మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో తమకు లైన్ క్లియర్ అయినట్టేనని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే, అది అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల సందర్భంగా బాబు చేసిన విమర్శలను మోదీ, షా మరచిపోయే అవకాశం లేదని అంటున్నారు. మరోవైపు ఏపీలో అధికార పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. టీడీపీతో మాత్రం సానుకూల వైఖరి కనబరచడం విశేషం. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు ఒకరకంగా ఉండగా.. జాతీయ స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మళ్లీ కలిసి సాగుతాయా అనేది ఇప్పుడే చెప్పలేం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....