‘సీతారామం’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మృణాల్ ఠాకూర్( Mrunal Thakur). అంతకుముందు ఆమె ఎన్నో సినిమాలు చేసినా రాని స్టార్ డమ్ ఆ ఒక్క సినిమా సక్సెస్ తో వచ్చేసింది. దీంతో ఆమెకి ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ అవకాశాలు క్యూ కట్టాయి. రీసెంట్ గా మృణాల్..’సీతారామం’ మూవీలోని నటనకి గాను సైమా అవార్డు అందుకుంది. ఆ వేదికపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్( Allu Aravind).. మృణాల్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే తెలుగింటి కోడలు అయిపోతావని చెబుతూ ఆమెకు అవార్డు అందించారు.
‘ గతంలో ఓ హీరోయిన్ తో ఓ మాట అన్నాను. తెలుగింటి అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చేయమని చెప్పాను. నా మాటని ఆమె నిజం చేసింది. ఇప్పుడు నువ్వు కూడా టాలీవుడ్ కోడలుగా హైదరాబాద్ కి వచ్చేసేయ్’ అని ఆమె ని ఉద్దేశించి అల్లు అరవింద్ కామెంట్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, గతంలో ఓ వేదికపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi) ని ఉద్దేశించి ‘ఇక్కడి అబ్బాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ కి వచ్చెయ్ అమ్మా’అంటూ ఆశీర్వదించారు. లావణ్య- వరుణ్ తేజ్ ని పెళ్లాడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలోని టస్కని వేదికగా వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, అప్పట్లో లావణ్యతో అన్న మాటలు నిజమయ్యాయి కాబట్టి ఇప్పుడు మృణాల్ ని ఉద్దేశించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు కూడా నిజమవుతాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.