మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ రెండవ వరం కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న సంగతి మేము ఇది వరకే తెలిపాము. ఇండియన్ సినిమా గౌరవాన్ని పెంచేలా చేసిన ఈ సినిమాని ప్రముఖులకి చూపించాలని చిరు పలువురు సెలబ్రిటీస్ ని కలుస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవలే తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందరరాజన్ ని కలిసి, ఆమెకి స్పెషల్ గా ‘సైరా’ మూవీని కూడా చూపించారు.
అలాగే ఇవాళ ‘సైరా’ సినిమా రోజుకి 5 షోలు పర్మిషన్ ఇచ్చినందుకు చిరు సతీ సమేతంగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే జగన్ గారు వీలు చేసుకుంటా అంటే ప్రత్యేకంగా షో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ని కూడా కలిసి స్పెషల్ షోస్ పర్మిషన్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి స్పెషల్ షో కోసం ఆహ్వానించాలి అనుకున్నారు.
కానీ సీఎం కేసీఆర్ చిరు ఆహ్వానాన్ని తిరస్కరించారు. మొదట కేసీఆర్ కలవటానికి సుముఖంగానే ఉన్నా, తర్వాతే వద్దన్నారు. దానికి కారణం ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆర్.టి.సి బంద్.. ఈ బంద్ కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు త్యాగం చేశారు. ఈ టైంలో ఫిల్మ్ స్టార్స్ తో భేటీ అనేది కరెక్ట్ కాదని కెసిఆర్ చిరుతో మీటింగ్ కాన్సిల్ చేశారట. మరి చిరుకి ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తారో చూడాలి.
5519 56697There is noticeably a bundle comprehend this. I suppose you made specific nice points in functions also. 227241