పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మాట్లాడుతున్నారు. కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తూ.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ… దానికి బాధ్యులైన నిందితులకు కఠిన శిక్షలు వేయాలని పవన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగు సినిమాల్లో పెరిగిపోతున్న బూతు పదజాలం, అమ్మాయిలను చూపిస్తున్న విధానాల కారణంగానే దిశ లాంటి ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని పవన్ పేర్కొన్నారు. ఇది నిజమే కదా.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పోకడ పూర్తిగా మారిపోయింది.
హింస, నేరప్రవృత్తి, అరాచకాలు ఇవే సినిమాలో ఎక్కువగా ఉంటున్నాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం హింసను ఎక్కువగా చూపిస్తున్నారు. ఇదే నేటి యువత తప్పుడు మార్గంలో నడవడానికి ఒక కారణం. రెండో కారణం మద్యం. మద్యం మత్తులో మేమేం చేస్తున్నామో మాకే తెలియడం లేదు అని నిందితులు చెప్పిన మాటలు వింటే… మద్యం ఎంత తప్పుడు మార్గంలో నడిపిస్తుందో అర్ధం అవుతున్నది.
మద్యం లేకుంటే ప్రభుత్వాలకు ఆదాయం లేదు. అందుకే ఏ ప్రభుత్వం కూడా మద్యపానాన్ని సంపూర్ణంగా అమలు చేయలేకపోతున్నది. ఇది వాస్తవం. ఏదో కొద్దిగా తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు. పూర్తగా మాత్రం నిషేధం విధించడం లేదు.
అదే విధంగా దేశంలో రాజకీయాలు కులాలు, మతాల ప్రాతిపదిక నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మతాల మధ్య గొడవలు పెట్టేది హిందూ రాజకీయ నాయకులే అని పవన్ అన్న మాటలను చాలామంది తప్పుగా అర్ధం చేసుకున్నారు. మతాల మధ్య హిందూ రాజకీయ నాయకులు చిచ్చు పెడుతున్నారు అనే పవన్ చెప్పడం వెనుక కారణం ఉన్నది.
రాష్ట్రంలో మతాల వారీగా, కులాల వారీగా ఇంకా చెప్పాలంటే ప్రాంతాల వారీగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ భావనతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మతతత్వ రాజకీయాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ, ఎవరూ కూడాను ఈ విషయం గురించి మాట్లాడరు. కారణాం ఏంటి అంటే.. భయం. మతతత్వ రాజకీయాలు చేయకుంటే రేపు ఓట్లు రాలవు కదా.
548738 828396very nice post, i definitely enjoy this remarkable website, persist with it 380327