ఉమ్మడి రాష్ట్రంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ప్రయాణం చేసి అన్ని డిపోల్లో బాధాకసాధకలు తెలుసుకొని ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చిన ఘనత తనదే అని కెసిఆర్ ఎన్నోసార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత కూడా కెసిఆర్ ముఖ్యమంత్రి కావడంతో… మిగతా పనుల బిజీ కారణంగా రాష్ట్రంలోని ఆర్టీసీ గురించి పెద్దగా పట్టించుకోలేకపోయారు. ఇది వాస్తవం.
ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారో… అప్పటి నుంచి తెలంగాణాలో లొల్లి మొదలైంది. తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని, 26 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కార్మికులు సమ్మెకు దిగారు. 55 రోజులు సమ్మె తరువాత కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటుగా వారికి వరాలు ప్రకటించారు.
వారికి వరాలు ఇస్తూనే ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టారు. ఈరోజు నుంచి తెలంగాణలో ఆర్టీసీ పెంచిన చార్జీలు అమలులోకి వచ్చాయి. ఒక్కో టికెట్ పై కనీసం 10 రూపాయల మేర భారం పడబోతున్నది. సంవత్సరానికి ఈ పెంచిన చార్జీల ద్వారా వెయ్యికోట్ల రూపాయల ఆదాయం లభించబోతున్నది. ఈ స్థాయిలో చార్జీలు పెంచినప్పటికీ ఆర్టీసీ నష్టాలు తీరిపోవట… దీంతో మరోమారు కూడా చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
మరో సంవత్సరం తరువాత ఈ చార్జీలను పెంచాలని అనుకుంటున్నారు. అలా పెంచితే… ఆర్టీసీకి ఉన్న అప్పులు తీరిపోయి నష్టాల నుంచి బ్రేక్ ఈవెన్ అవుతుంది. అప్పటి నుంచి ఆర్టీసీ లాభాల్లో పయనిస్తుంది. కెసిఆర్ చెప్పినట్టుగా ఆర్టీసీ కార్మికులకు కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినట్టుగానే బోసన్ లు ఇస్తారు.
సింగరేణి అంటే బొగ్గు తవ్వకాలు జరపడం వలన లాభాలు వస్తున్నాయి. మరి ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థ. ప్రజారవాణాలో ఇష్టం వచ్చినట్టుగా చార్జీలు పెంచితే ఎలా దొరగారు. చార్జీలు పెంచుతారు.. నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతారు. కానీ, సామాన్యుల జీతాలను మాత్రం పెంచరు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా కల్పించరు. ఇది న్యాయమా చెప్పండి దొరగారు.
43055 658445Just a smiling visitant here to share the really like (:, btw outstanding style . 629770
807367 609545Outstanding publish from specialist also it will probably be a amazing know how to me and thanks extremely much for posting this valuable data with us all. 44215