రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ఎక్కడోచోట గాడి తప్పుతోంది. సదుద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొందరి తీరు ప్రభుత్వానికే మచ్చ తెస్తోంది. అనంతపురం జిల్లాలో ఓ వాలంటీరు ఏకంగా వృద్ధాప్య పింఛను సొమ్ముతో పరారవడం కలకలం రేపుతోంది.
పెనుకొండ మండలం కొండంపల్లిలో బుధవారం జరిగిందీ ఘటన. కొండంపల్లికి చెందిన హనుమంతు నాయక్ గ్రామ వలంటీరుగా పని చేస్తున్నాడు. ప్రతినెలలానే ఈనెల కూడా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. మంగళవారంనాడు స్థానిక వెల్ఫేర్ ఆఫీసర్ హీరా నుంచి 49మందికి ఫించను అందించేందుకు రూ.63,500 తీసుకున్నాడు.
బుధవారం ఉదయం నుంచే లబ్దిదారులకు పింఛను అందించాల్సిన హనుమంతు నాయక్ ఆ పని చేయలేదు. తీసుకున్న నగదుతో పారిపోయాడు. పింఛను వస్తుందని ఎదురుచూస్తున్న వారికి రోజు గడుస్తున్నా అందకపోయేసరికి సచివాలయ ఉద్యోగులకు ఫిర్యాదు చేసారు. దీంతో పంచాయతీ సిబ్బంది రంగంలోకి దిగారు.
పంచాయతీ కార్యదర్శి గంగరత్నమ్మ, వెల్ఫేర్ ఆఫీసర్ హీరా గ్రామంలో హనుమంత్ నాయక్ కోసం విచారించారు. అయినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. హనుమంత్ నాయక్ పై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. సదరు వాలంటీరు గతంలో విచ్చలవిడిగా పేకాట ఆడేవాడని తెలుస్తోంది. దీంతో పోలీసులు అతని ఆచూకి కోసం గాలిస్తున్నారు.
139716 190008Quite interesting topic , thanks for putting up. 391560
424378 320503Hi there! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im undoubtedly enjoying your weblog and appear forward to new posts. 486028
299483 120910I feel this site contains some quite excellent information for every person : D. 983419