భవిష్యత్తులో ప్రేక్షకుల్ని అలరించడానికి మరింత కష్టపడతానని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. గత నెలలో జరిగిన ప్రతిష్టాత్మ సైమా అవార్డుల ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన మాట్లాడారు.
‘ఈ ఫంక్షన్ రాకూడదని అనుకున్నా. కానీ.. మీ అందరికీ మాట ఇచ్చేందుకు వచ్చా. అభిమానులు, కుటుంబం, స్నేహితుల్ని అలరించేందుకు మరింత కష్టపడి పని చేస్తా. ఇక్కడ అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు. వారంతా మంచి సినిమాలతో చిత్ర పరిశ్రమను ముందుకు నడిపించారు. నావంతుగా నేనూ కష్టపడి పని చేశా. కానీ.. అది సరిపోలేదు. మనకు మంచి, చెడ్డ రోజులు ఉంటాయి. అన్నింటినీ దాటుకుని మనం చేయాల్సిన పనులు పూర్తి చేయాలి’ అని అన్నారు. సైమా అవార్డుల ఫంక్షన్ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో జరిగింది.
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటించాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.
780460 883699You must get involved in a contest first with the greatest blogs over the internet. Ill recommend this page! 432088
40241 626018Hi there. Really cool internet site!! Guy .. Beautiful .. Wonderful .. I will bookmark your website and take the feeds additionallyI am glad to locate so much useful info correct here within the write-up. Thanks for sharing 618704