మారాల్సింది రాజకీయ నాయకులు కాదు.! ప్రజలే మారాలి.! ఆ ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజాధనంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అధికారంలో వున్న పార్టీలు తమకు నచ్చినవారి పేర్లను ఆయా సంక్షేమ పథకాలకు పెట్టడమేంటి.?
యూనివర్సిటీల పేర్లు సైతం మార్చేస్థాయికి ‘పరిపాలన’ దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వేమన విగ్రహమెందుకు.? వైఎస్సార్ విగ్రహం వుంటేనే పండగ.. అనే స్థాయికి అధికారం తన స్థాయిని దిగజార్చేసుకుంది.
‘ఎవడబ్బ సొమ్మనీ..’ అని అంటాడో మహానుభావుడు. అవును, ఏ పార్టీ అధికారంలో వున్నా.. సంక్షేమ పథకాలు కావొచ్చు, అభివృద్ధి కావొచ్చు.. అవన్నీ జరిగేవి, అమలయ్యేవి ప్రజాధనంతోనే. ఏ రాజకీయ పార్టీ కూడా వేల కోట్లు, లక్షల కోట్లను ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వెచ్చించవు.
మొన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మారింది.. తాజాగా వేమన విగ్రహం స్థానంలోకి వైఎస్సార్ విగ్రహం వచ్చి చేరింది. వాట్ నెక్స్ట్.? ఆంధ్రప్రదేశ్ కాస్తా వైఎస్సార్ ప్రదేశ్ అవడమే తరువాయి ఏమో.! జగనన్న కాలనీలట.. ఔను మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత సొమ్ములతో కదా, పేదలకు ఇళ్ళు కట్టిస్తున్నది.?
ఎవరూ ప్రశ్నించకపోతే పరిస్థితి ఇలాగే వుంటుంది. ప్రశ్నించాల్సింది విపక్షాలు కానే కాదు, ప్రజలు మాత్రమే. ‘మా మీద అప్పు చేసి, మా సొమ్ములతో మాకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. వాటికి మీ పేర్లు పెట్టుకోవడమేంటి.?’ అని పాలకుల్ని ప్రజలు ప్రశ్నించాల్సిందే. అప్పుడే అధికారంలో వున్నవారిని నిలదీసే విపక్షాల పోరాటానికీ ఓ అర్థం వుంటుంది.
అయినా, పేర్లు.. రంగులు.. విగ్రహాలు.. వీటి వల్ల సాధించేదేంటి.? చంద్రబాబు హయాంలో అన్నిటికీ చంద్రన్న పేర్లు పెట్టుకున్నారు.. కొన్నిటికి ఎన్టీయార్ పేర్లు పెట్టుకున్నారు. టీడీపీ తిరిగి అధికారంలోకి రాగలిగింది.? చంద్రబాబుది మూర్ఖత్వమని నిరూపితమయ్యింది. ప్రస్తుతం వైసీపీ హయాంలో జరుగుతున్నదేమిటి.? ఈ మూర్ఖత్వానికీ సమాధానం చెప్పాల్సింది ప్రజలే.!
అన్నట్టు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వేమన పద్యాల్ని ప్రస్తావించారు. ‘ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు పరగ మూలికలకు పనికివచ్చు నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు? విశ్వదాభిరామ వినుర వేమ’ అన్నది అందులో ఓ పద్యం. ‘ విష వృక్షమైన ముష్టి, అమిత చేదుగా వుండే వేపాకు కూడా ఔషద రూపంగానైనా లోకానికి ఉపయోగపడతాయి.. దుర్మార్గుడు సంఘానికి ఏ విధంగానూ ఉపయోగపడడు.. అంతే కాదు హాని కూడా చేస్తాడు..’ అన్నది ఆ పద్యం తాలూకు అర్థం.
దీంతోపాటు ఇంకో పద్యం కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ‘విద్యలేనివాడు విద్వాంసుల దగ్గర వున్నంతమాత్రాన వాడు ఎప్పటికీ విద్వాంసుడు కాలేడు. సరోవరంలోని రాజహంసల సమూహంలో కొంగ వున్నంతమాత్రాన అది రాజహంస అవదు కదా..’ అనే అర్థం వచ్చే వేమన పద్యాన్ని పవన్ పేర్కొన్నారు.
766131 849658Just wanna comment which you have a really good site, I the style and design it really stands out. 771062
166392 415826I discovered your internet site website online and check numerous of your early posts. Keep on the top notch operate. I just now additional your Feed to my MSN News Reader. Seeking for forward to reading considerably a lot more from you finding out later on! 448717
18074 802362Some genuinely great weblog posts on this internet site , thankyou for contribution. 77281