యంగ్ మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న విషయం తెల్సిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడైన వైష్ణవ్ ఉప్పెన ప్రోమోలతో ఆకట్టుకున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉప్పెన ఏప్రిల్ 2న విడుదలకు షెడ్యూల్ అవ్వగా కరోనా కారణంగా థియేటర్లు మూసివేయడంతో విడుదల వాయిదా పడక తప్పలేదు.
థియేటర్లు మళ్ళీ ఓపెన్ చేసాక అనువైన పరిస్థితిని చూసి ఉప్పెనను విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సుకుమార్ సమర్పిస్తున్నారు. వైష్ణవ్ సరసన నటించిన కృతి శెట్టికి కూడా ప్రోమోలతో ఫాలోయింగ్ పెరిగింది. ఉప్పెనలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే.
ఇప్పుడు ఇదే విజయ్ సేతుపతి వల్ల ఉప్పెన తమిళ్ కు వెళుతోంది. ముందు ఈ చిత్రాన్ని డబ్ చేద్దామనుకున్నా విజయ్ సేతుపతి సూచన మేరకు రీమేక్ చేయడానికి మైత్రి సంస్థ నిర్ణయించుకుంది. హీరోగా తమిళ స్టార్ హీరో థళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ ను అనుకుంటున్నారు. ఈ చిత్రం ద్వారా సంజయ్ పరిచయమైతే బాగుంటుందని వారు భావిస్తున్నారు.
ఈ విషయంపై విజయ్ సేతుపతి మాస్టర్ సినిమా సెట్స్ లోనే విజయ్ తో చర్చించినట్లు సమాచారం. కొంచెం లేట్ గా ఈ న్యూస్ బయటకు వచ్చింది. సంజయ్ ఇప్పుడు కెనడా లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేస్తున్నాడు. అది పూర్తయ్యి ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
869699 446901Wow! This could be one certain of the most helpful blogs Weve ever arrive across on this topic. In fact Fantastic. Im also an expert in this subject therefore I can understand your hard function. 689967
58798 512241Fantastic post, thanks so significantly for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 311233
247630 94520This web web site may be a walk-through for all of the details you wanted in regards to this and didnt know who to question. Glimpse here, and youll definitely discover it. 27978