అధికారంలోకి రాకముందు ఏవేవో మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక మౌనంగా వుండిపోవడం తగదని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి ప్రస్తావిస్తూ. గతంలో చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్.. ఇద్దరూ బీజేపీకి దగ్గరగా వుండేందుకే ప్రయత్నించారనీ, ప్రయత్నిస్తున్నారనీ, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని ఉండవల్లి ఆరోపించారు.
‘విభజన చట్టంలో అన్నీ వున్నాయ్. ఆ చట్టాన్ని పట్టుకుని పార్లమెంటులోనూ, కోర్టుల్లోనూ పోరాడాల్సి వుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి లొంగిపోయారు. పవన్ కళ్యాణ్కి ప్రజలు అధికారం ఇచ్చి వుంటే ఎప్పుడో తేల్చేసేవారు..’ అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో విభజన చట్టం ద్వారా తెలంగాణ నుంచి 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రావాల్సి వుందనీ, ఇప్పుడది లక్ష కోట్లకు చేరుకుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ అడగకపోతే తెలంగాణ ఎందుకు ఇస్తుంది.? ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికి వుందిగానీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే తాము మద్యవర్తిత్వం వహిస్తామంటూ కేంద్రం తప్పించుకుంటోంది..’ అని ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు.
‘పవన్ కళ్యాణ్కి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అయినాగానీ, ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడ్ని నేను దేశ రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ చూడలేదు..’ అని చెప్పిన ఉండవల్లి, గతంలో తాను చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నారనీ, అయినాగానీ ఆయన ఇప్పుడు విభజన సమస్యలపై గొంతు మెదపడంలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు.
‘ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత బాధ్యత కలిగి వున్నాయి. కానీ, వైసీపీ అలాగే టీడీపీ కేంద్రానికి లొంగిపోయాయ్. ఈ తరుణంలో జనసేన పార్టీ చేయగలిగిందేమీ లేదు. ప్రజల్లోంచే పోరాటం రావాలి..’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
‘చట్టం కల్పించిన హక్కుల్ని సాధించుకోలేకపోతున్నాం. ఈ విషయమై రాష్ట్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికార పక్షాన్నీ, ప్రతిపక్షాన్నీ నిలదీయాలి.. అప్పుడే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది..’ అని ఉండవల్లి స్పష్టం చేశారు.
803590 136457Nice weblog here! right after reading, i decide to buy a sleeping bag ASAP 992122
926448 779497But wanna comment on few common points, The internet site style is perfect, the content material is truly very good : D. 361726