ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ డీఎంకే నేత, స్టాలిన్ కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ చేసిన సంచలన ఆరోపణలు వివాదాస్పదం అయ్యాయి. ‘మోదీ ఒత్తిడి తట్టుకోలేకే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వారి రెండు కుటుంబాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ‘ఉదయనిధి గారూ… మీ రాజకీయాల కోసం మా అమ్మ పేరును వాడొద్దు. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారు. పార్టీ కూడా మాకు అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని బాధించాయి’ అని సుష్మ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
‘ఉదయ నిధి గారూ…. మీరు ఎన్నికల ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారన్న విషయం అర్ధమవుతోంది. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం సహించను. మా తండ్రి, మోదీకి మధ్య ఎంతో మంచి బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. వారి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తి మీరు సంపాదిస్తారని అనుకుంటున్నాను’ అంటూ అరుణ్ జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
103986 824439I enjoyed reading your pleasant internet site. I see you offer priceless info. stumbled into this site by chance but Im positive glad I clicked on that link. You definitely answered all the questions Ive been dying to answer for some time now. Will undoubtedly come back for more of this. 984437
790751 779012some truly interesting information , nicely written and broadly speaking user genial . 699551