జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేసారు. ఇప్పుడు పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సైతం చంద్రబాబు నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలను బహిష్కరించడం కంటే పోటీ చేయడమే ఉత్తమం. గెలుస్తామో, ఓడతామో తర్వాతి విషయం.. బరిలో ఉండటం ముఖ్యం.
ఎన్నికల నుంచి తప్పుకోవడంపై పార్టీ నేతల, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని ఉండాల్సింది. నిజమైన కార్యకర్తలకు ఎప్పుడూ ఇబ్బంది ఉంటుంది. వారికి భరోసా ఇవ్వాల్సింది పార్టీనే. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చినా ఆగినచోట నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. అయినా.. ఎన్నికల్లో నిలవడం మన బాధ్యత అన్నారు. దీంతో పార్టీ నేతల్లో చంద్రబాబు నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. మరి.. దీనిపై చంద్రబాబు నాయుడు, పార్టీ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
1433 962741Now we know who the ssebnile 1 is here. Great post! 528954
442759 18317I got what you mean , saved to bookmarks , really decent web site. 638336