ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటలతో మాయ చేసి హిట్ కొట్టగలిగిన త్రివిక్రమ్ తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. హారిక హాసినీ క్రియేషన్స్ – నందమూరి తారకరామారావు ఆర్ట్స్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాని ఏప్రిల్ లో పూజ చేసి జూన్ నుంచి షూట్ మొదలు పెట్టాలి అనుకున్నారు.
కానీ అనుకోకుండా కరోనా అనే మహమ్మారి ప్రపంచం మీద విరుచుకుపడడంతో ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. అందులో భాగంగా సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. అసలు విషయంలోకి వెళితే అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్.టి.ఆర్ ఏప్రిల్ లేదా మే కల్లా ఆర్ఆర్ఆర్ షూట్ ఫినిష్ చేసి త్రివిక్రమ్ మూవీ కోసం రెడీ అవ్వాలి. కానీ ఇప్పుడు అనుకున్న ఆర్ఆర్ఆర్ షెడ్యూల్స్ వెనక్కి వెళ్లాయి. ఇప్పటికే ఒక నెల కాల్ షీట్స్ వెస్ట్ అయ్యాయి.
ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి కొనసాగుతుందో క్లియర్ గా తెలియదు. కావున జులై లేదా ఆగష్టు వరకూ ఎన్.టి.ఆర్ కి ఆర్ఆర్ఆర్ తోనే సరిపోతుంది. దాంతో ఈ టైంలో ఖాళీగా కూర్చోవడం కంటే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అది కూడా తన ఆస్థాన ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని క్రియేషన్స్ కి కొడుకు లాంటి ప్రొడక్షన్ సితార ఎంటర్టైన్మెంట్స్ కి చేయనున్నారట.
ఇటీవలే సితార ఎంటర్టైన్మెంట్స్ ‘అయ్యప్పనుం కోశియుమ్’ అనే మలయాళ సినిమా రీమేక్ రైట్స్ ని కొనుక్కున్నారు. ఆ సినిమా త్రివిక్రమ్ చూడడం, నచ్చడంతో ఆయనే డైరెక్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో నందమూరి బాలకృష్ణ – రానా దగ్గుబాటి లను పరిశీలిస్తున్నారు. మరి త్రివిక్రమ్ డైరెక్టర్ గా ఫిక్స్ అయితే హీరోలుగా ఎవరు లిస్ట్ లోకి వస్తారో చూడాలి.
690519 43461Nice read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch since I found it for him smile Therefore let me rephrase that: Thank you for lunch! 419553
523105 981510Youre the best, It is posts like this that maintain me coming back and checking this internet site regularly, thanks for the information! 808178