ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించేందుకు తీసుకొచ్చిందే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. అయితే.. పలుచోట్ల గ్రామ వాలంటీర్లు చేస్తున్న పనులు ఆ వ్యవస్థపై మచ్చ తెచ్చేలా ఉంటున్నాయి. అటువంటి సంఘటనే అనంతపురం జిల్లా శింగనమల మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు బాలికలను గ్రామ వాలంటీర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది.
మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16, 17 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు పక్క గ్రామంలో టైలరింగ్ నేర్చుకుంటున్నారు. రోజూలానే ఈనెల 25న కూడా పనికి వెళ్లారు. ఆ సమయంలో బాలికలిద్దరూ ఒంటరిగా ఉండడం చూసిన ముగ్గురు గ్రామ వాలంటీర్లు వారిద్దరినీ కిడ్నాప్ చేశారు. వారిద్దరికీ మత్తు మందు ఇచ్చి కారులో తీసుకెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే స్పందించి అదే రోజు రాత్రి బాలికల ఆచూకీ కనుగొని రక్షించారు. నిందితులను అరెస్టు చేశారు. బాలికలను కిడ్నాప్ చేసింది శివరాం, చంద్రశేఖర్, మధుసూదన్ అనే ముగ్గురు గ్రామ వాలంటీర్లుగా తేల్చారు పోలీసులు. వీరికి సాయం చేసిన వీరి స్నేహితులు చంద్రముత్యాలు, రామాంజనేయులును కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరందరి నుంచీ తమకు ప్రాణహాని ఉందని బాలికల తల్లిదండ్రులు పోలీసులకు చేసిన ఫిర్యాతులో పేర్కొన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
288478 197630Wow! This could be one certain with the most useful blogs Weve ever arrive across on this subject. Really Wonderful. Im also an expert in this subject therefore I can understand your hard work. 251401
649076 93048I believe so. I feel your post will give those men and women a great reminding. And they will express thanks to you later 216849