పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు తరుణ్ భాస్కర్. అయితే హిట్ రాగానే వెంటనే అడ్వాన్స్ లు అందుకుని రొటీన్ మోడ్ లోకి వెళ్లడం ఇష్టం లేని తరుణ్ ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే ఎవర్ గ్రీన్ సినిమాను చేసాడు. దాని తర్వాత ఐదేళ్లకు ఇప్పుడు కీడా కోలా అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది.
ఈ చిత్ర ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ఈ ప్రెస్ మీట్ లో మీడియా పెళ్లి చూపులు చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేసే ప్రపోజల్స్ చాలానే వస్తుంటాయి. అయితే వీటిపై తరుణ్ భాస్కర్ కు ఒక క్లారిటీ ఉంది.
పెళ్లి చూపులు చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన లేదని చెప్పేసాడు తరుణ్. అయితే ఆ చిత్రంలోని హీరో ప్రశాంత్ పాత్రను తీసుకుని దాంతో వేరే కొత్త సినిమా చేసే ఆలోచన చేయొచ్చని మాత్రం అన్నాడు. ఆలోచన కొత్తగా ఉంది. మరి ఎప్పుడు అమలవుతుందో ఏంటో.