ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 4వ తేదీ (శనివారం) ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఏపీ విద్యాశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. విజయవాడలో ఆరోజు ఉదయం 11గంటలకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
2019 తర్వాత విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాయలేదు. కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదు. 2020లో అందరినీ పాస్ చేయగా.. 2021లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ప్రయత్నం విరమించుకుంది.
దీంతో ఈ ఏడాదే విద్యార్ధులు పరీక్షలు రాసారు. ఏప్రిల్ 27 నుంచి మే9 వరకూ జరిగిన పరీక్షల్లో 6,21,799 మంది పరీక్షలు రాశారు. అయితే.. ఈసారి గ్రేడ్ విధానంకు బదులుగా మార్కులు ప్రకటించనున్నారు. గతంలో వివాదాలు, విద్యార్ధుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ర్యాంకులకు బదులుగా గ్రేడ్ విధానం తీసుకొచ్చారు. కానీ.. ఆర్మీ, ఉన్నత చదువుల ప్రవేశాలకు అవరోధంగా మారడంతో ఈ విధానాన్ని రద్దు చేశారు.
527641 519847Hey mate, .This was an outstanding post for such a hard topic to speak about. I appear forward to seeing numerous far more superb posts like this 1. Thanks 246196