ఇటీవలే ఇండియా 2 సెట్స్ లో భారీ ప్రమాదం జరగడం .. ముగ్గురు మృతి చెందడం, కమల్, కాజల్ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్న విషయం తెలిసిందే. భారతీయ సినీ వర్గాల్లో సంచలనం రేపిన ఈ యాక్సిడెంట్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో జాతీయ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇండియన్ 2. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఇండియన్ టైటిల్ తో వచ్చి అన్ని భాషల్లో సంచలన విజయం అందుకున్న ఆ సినిమాకు ఇది సీక్వెల్.
అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుండగా, షూటింగ్ మధ్యలో ప్రమాదవశాత్తు క్రైన్ విరిగిపడి ముగ్గురు మరణించారు. ఈ సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తుంటే .. తమిళ నటుడు రాధా రవి మాత్రం శంకర్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీసే దర్శకులు సినిమాకు పనిచేసే వారి సేఫ్టీ విషయం మాత్రం గాలికి వదిలేస్తున్నారంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఇలాంటి దర్శకుల్లో మార్పు రావాలని, సినిమా ఎంత ఖర్చు పెట్టి తీశామన్నది కానీ అక్కడ పనిచేస్తున్న వారికి ఎంత రక్షణ కల్పించాం అన్నది ముఖ్యమంటూ శంకర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేసాడు.
ప్రస్తుతం అయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా అయన ఇండియన్ 2 షూటింగ్ లో చనిపోయిన ముగ్గురికి సంబందించిన సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధారవి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ మద్యే పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ రాదా రవి పలు విమర్శలు గుప్పించడం తెలిసిందే.
810009 43375Some genuinely intriguing info, well written and typically user genial . 539188