వ్యక్తిగత పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బుధవారమే ఇరువురి భేటీ జరిగిందని సమాచారం. తన భార్య వైద్య చికిత్స నిమిత్తం చౌహాన్ మంగళవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను కలిసినట్టు తెలిసింది. ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బీజేపీ పాలిత సీఎం.. కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. బీజేపీపై యుద్దం ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అది మరింత పెరిగింది. అయితే, డిసెంబర్ 11న కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన వచ్చిన తర్వాత మళ్లీ మార్పు కనిపించింది. తొలుత ఢిల్లీలో రైతు ఆందోళనలకు మద్దతిచ్చిన కేసీఆర్.. అనంతరం రాష్ట్రంలో సాగు చట్టాల అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించడం వంటి విషయాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చౌహాన్ తో సమావేశం కావడం చూస్తే బీజేపీకి దగ్గరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
540959 669270Oh my goodness! a fantastic post dude. Thanks Nevertheless My business is experiencing issue with ur rss . Dont know why Not able to sign up for it. Possibly there is any person obtaining identical rss difficulty? Anyone who knows kindly respond. Thnkx 350385
83050 516061I got what you intend, saved to bookmarks , really decent web website . 918845
600068 349038Maintain websiteing stuff like this I in fact am fond of it 489955