సందీప్ రెడ్డి వంగా నుండి సినిమా వస్తోందంటే ప్రేక్షకుల సంగతి పక్కనపెట్టి ముందు సెన్సార్ వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. రీసెంట్ గా విడుదలైన యానిమల్ ను చూసిన చాలా మంది ఇందులో కొన్ని సీన్లు అసలు సెన్సార్ ను ఎలా దాటాయి అని ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి అర్జున్ రెడ్డి తర్వాత మహేష్ తో డెవిల్ చేయాలనుకున్నాడు సందీప్. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దాంతో షుగర్ ఫ్యాక్టరీ అనే బోల్డ్ సబ్జెక్ట్ ను తీసుకున్నాడు. వేశ్యావృత్తి, స్మగ్లింగ్, డ్రగ్స్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ‘రా’నెస్, బోల్డ్ నెస్, రక్తపాతం మరీ ఎక్కువ అవుతున్నాయి అని సందీప్ నే భావించాడట. ఇది సిల్వర్ స్క్రీన్ కు సెట్ అయ్యే సినిమా కాదని, దీన్ని సిరీస్ గా మలిచే ఆలోచన చేస్తున్నాడట.
సిల్వర్ స్క్రీన్ మీదే సందీప్ ను పట్టుకోలేం ఇక ఎలాంటి సెన్సార్ పరిమితులు లేని ఓటిటిలో సందీప్ కంటెంట్ అంటే అదెలా ఉండబోతోందో.