రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడా అని చూస్తోన్న సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ లో మొదలయ్యాయి. ముందుగా పాత తరహాలో థియేటర్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు నిర్వాహకులు. అయితే అదెంత తప్పుడు నిర్ణయమో చాలా త్వరగానే తెలిసొచ్చింది. నిన్న రాత్రి 8 తర్వాత సలార్ బుకింగ్స్ ఇలా ఓపెన్ అవ్వడం ఏంటి అలా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ హవా చాలా ఎక్కువగా ఉంది.
అధికారిక లెక్కల ప్రకారం సగటున గంటకు 25 వేల టికెట్లు అమ్ముడైపోతున్నట్లు సమాచారం. ఇక తెలంగాణాలో స్పెషల్ షోస్ కు అనుమతి ఇచ్చారు. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోస్ కూడా ఓ రేంజ్ లో అమ్ముడైపోతున్నాయి. తెలంగాణాలో భారీగా టికెట్ హైక్స్ కు అనుమతులు వచ్చేసాయి. రేట్స్ ఎంత ఎక్కువ ఉన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.