కొన్ని వివాదాలు కాలంతో పాటే, చల్లారిపోతాయి. కొన్ని కాలం గడిచే కొద్దీ ముదిరి పాకాన పడతాయి. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో కొందరు మొదలుపెట్టిన రచ్చ ముందు ముందు ముదిరి పాకాన పడుతుందా.? లేదంటే, వివాదం డైల్యూట్ అవుతుందా.? ఈ చర్చ సినీ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది.
విగ్రహ ప్రతిష్ఠాపన కోసం చిరంజీవి ఉయ్యాలవాడ గ్రామస్థులకు ఓ మాటిచ్చారట. ఇది ఓ వెర్షన్. కాదు, ఉయ్యాలవాడ కుటుంబానికి కొంత మొత్తం రాయల్టీ చెల్లించేందుకు ‘సైరా’ టీమ్ ఒప్పుకుందన్నది మరో వెర్షన్. ఇవేమీ కాదు, కొందరు అడ్డగోలుగా రచ్చ చేస్తున్నారన్నది ఇంకో వెర్షన్. ఏది నిజం.? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ‘సైరా’ టీమ్. ప్రస్తుతానికి ఈ వివాదం కొంత సద్దుమనిగింది. అయితే, ముందు ముందు ఇదొక పెను దుమారం కాబోతోందని సమాచారమ్.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నానా యాగీ చేయడానికి స్కెచ్ రెడీ అవుతోందనీ, ఆ రోజు నుండే సినిమా ప్రమోషన్స్ అగ్రెసివ్గా ప్రారంభమవుతాయనే ప్రచారం నేపథ్యంలో మెగా వ్యతిరేకులు సన్నద్ధమవుతున్నారు. అయితే, అప్పటిదాకా వివాదాన్ని నాన్చడం అనవసరం అన్న అభిప్రాయం కొంత మందిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి రాయల్టీతో సంబంధం లేని వ్యవహారమిది. డబ్బు కంటే కూడా, సినిమాని వివాదాల్లోకి లాగాలనే ఆలోచనే ఆ వ్యతిరేక వర్గంలో కనిపిస్తోంది.
కెరీర్లో ఇలాంటివి ఎన్నో చూసేసిన చిరంజీవి తాజా వ్యవహారంపై తొందరపాటు వద్దంటూ తనయుడికి సూచించారు. మెగా సైలెన్స్ వెనక అసలు కోణం ఇది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మెగాస్టార్గా ఎదిగిన చిరంజీవికి ఇది జస్ట్ ఓ మామూలు వివాదమే. అధిగమించిడం ఆయనకు పెద్ద విషయమేమీ కాదు. అయితే, రాజకీయ ప్రోద్భలంతో నడుస్తున్న వివాదం కనుక ఈ రగడ ముందు ముందు ఏమవుతుందో చూడాలిక.
260866 882809I certainly did not recognize that. Learnt 1 thing new today! Thanks for that. 704420
709298 548772Interesting, but not perfect. Are you going to write far more? 218955