Switch to English

అప్పుడు జగన్‌.. ఇప్పుడు చంద్రబాబు అదే ఓదార్పు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఓదార్పు యాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అంతటా తిరిగేశారు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఆ ఓదార్పు వెనక రాజకీయం అందరికీ తెలిసిందే. ఓదార్పు పేరుతో సెంటిమెంట్‌ని రగిల్చి, సింపథీ గెయిన్‌ చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది అప్పట్లో వైఎస్‌ జగన్‌ పన్నిన వ్యూహం. ఇప్పుడు తెలుగు దేశం పార్టీ అధినేత చరద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారు.

రాజకీయాలంటేనే, కాపీ – పేస్ట్‌ వ్యవహారం. ఒకరికి వర్కవుట్‌ అయిన విషయాన్ని ఇంకొకరు కాపీ కొట్టేస్తుంటారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాద యాత్ర చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. జగన్‌ అయితే, ఒకటికి రెండు సార్లు పాదయాత్ర చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలయ్యాక, తలెత్తిన సంక్షోభం నుండి గట్టెక్కడానికి చంద్రబాబు నానా తంటాలూ పడుతున్నారు.

అమరావతిలో ఓదార్పు షో అయిపోయింది. కుప్పంలో ఆ షో షురూ అయ్యింది. ‘మీరు ఓడిపోవడమేంటయ్యా..?’ అని జనం చంద్రబాబు దగ్గరకెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటోంటే, దానికి చంద్రబాబు అనుకూల మీడియా ఇంకొంచెం మసాలా దట్టించి కథనాలు వండి వడ్డిస్తోంది. త్వరలో చంద్రబాబు ఓదార్పు యాత్ర ప్రారంభిస్తారట. ‘భరోసా యాత్ర’ అనో, ఇంకో యాత్ర అనో దీనికి పేరు పెట్టబోతున్నారు.

అయితే, ఇది పాదయాత్ర కాదు. పరామర్శ యాత్ర. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రాజకీయ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించబోతున్నారు. మరోపక్క, జిల్లా యాత్రలు చేపడితే బావుంటుందనీ పార్టీ ముఖ్యనేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారట. దానికి ఇంకా సమయం ఉందనీ, అప్పుడే అంత పెద్ద పొలిటికల్‌ యాత్రలు సబబు కాదనీ చంద్రబాబు పార్టీ ముఖ్య నేతల్ని వారించినట్లు తెలుస్తోంది.

అటు అమరావతి రైతులు కావచ్చు. సొంత నియోజక వర్గ ప్రజలు కావచ్చు.. ‘మీరు ఓడిపోవడమేంటయ్యా..’ అని చంద్రబాబు వద్ద వాపోవడాన్ని పూర్తిగా తప్పు పట్టేయలేం. సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. పైగా ఎన్నికల ముందర, పసుపు కుంకుమ అనీ, మరోటి అని సంక్షేమ పథకాలు ప్రకటించి, ఎన్నికల ముందే అమలు చేశారు. లబ్ధిదారులుంటారు కదా.. వారి ఆవేదన ఆ స్థాయిలోనే ఉండొచ్చు కూడా, అయితే, దాని చుట్టూ జరుగుతున్న ప్రచారం ఆ సింపథీని చెడగొట్టేలా ఉంది. ఈక్వేషన్‌లో తేడాలేం లేవ్‌. అప్పుడు జగన్‌ చేసిందీ, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నదీ ఒక్కటే. మరి చంద్రబాబుకు ఈ ఓదార్పు కలిసొస్తుందా.? వేచి చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...