సౌత్ ఇండియాతో పాటు, నార్త్ ఇండియా కూడా ఎదురు చూస్తున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘సైరా నరసింహాహారెడ్డి’. మొదటిసారి బ్రిటిష్ వారిపై వ్యతిరేకతని రేకెత్తించి స్వాతంత్య్రం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. చిరంజీవితో పాటు ఇతర భాషల సూపర్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుధీప్, రవికిషన్ లతో పాటు లేడీ స్టార్స్ అయిన నయనతార, తమన్నా, అనుష్కలు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే మొదటి నుంచి ఈ సినిమా ‘సైరా’ కోసం ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టామని చెప్పుకుంటున్నారు కానీ ఎంత అనేది మాత్రం చెప్పడం లేదు. కానీ వీరు పబ్లిసిటీ కోసం రిలీజ్ చేసిన బడ్జెట్ నేమార్స్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 250 కోట్ల బడ్జెట్ అనేదగ్గర ప్రచారం మొదలయ్యి ఇప్పుడు 300 కోట్ల దగ్గర చేరుకుంది. రిలీజ్ నాటికి ప్రమోషన్స్ అవీ ఇవీ కలిపి ఇంకో 10 కోట్లు కలిపినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.
మేము ఈ చిత్ర సన్నిహితుల ద్వారా తెలుసుకున్న సమాచారం ప్రకారం సైరా కోసం సుమారు 200 కోట్లు అయ్యింది. కానీ బిజినెస్ పరంగా మార్కెట్ చేయడం కోసం ఇలా బడ్జెట్ ని పెంచి ప్రచారం చేస్తున్నారు. స్వతహాగా ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది, కానీ ఇలా రాంగ్ ప్రమోట్ చేసుకోవాల్సి రావడం బాధాకరం.
మరోవైపు ప్రమోషన్స్ సరిగా లేకపోవడం వల్ల మెగా అభిమానులు కాస్త అసహనానికి గురవుతున్నారు. మరి ఇక సినిమా ఎలాంటి రికార్డ్స్ బద్దలు కొడుతుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకూ వేచి చూడాల్సిందే.
681910 642169Wow, suprisingly I never knew this. Keep up with excellent posts. 727130