Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో ఆ మధ్య రెండు సినిమాలు చేసింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో ఈమె బాలీవుడ్ లో నెగ్గుకు రావడం కష్టమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ యానిమల్ సినిమాతో అక్కడ హిట్ కొట్టింది.
యానిమల్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిందీ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దాంతో ఈ అమ్మడు తన పారితోషికంను భారీగా పెంచేసినట్లుగా సమాచారం అందుతోంది. మొన్నటి వరకు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికంగా అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు భారీగా డిమాండ్ చేస్తోంది.
ఇటీవల ఒక టాలీవుడ్ నిర్మాత యంగ్ హీరో సినిమాలో ఈమెను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరిపాడట. ఆ సమయంలో రష్మిక రూ.4 కోట్ల పారితోషికం డిమాండ్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. మీడియం బడ్జెట్ సినిమా హీరోయిన్ కు నాలుగు కోట్ల పారితోషికం వర్కౌట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో ఆ నిర్మాత మరో హీరోయిన్ తో చర్చలు జరుపుతున్నాడట. రష్మిక డిమాండ్ చేస్తున్న నాలుగు కోట్లు మరీ ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొందరు మాత్రం ఆమెకున్న క్రేజ్ కి నాలుగు కోట్ల పారితోషికం ఎక్కువేం కాదు అంటున్నారు.